మనసాంస్కృతిసంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
554 views
19 hours ago
* సకలశుభాల కొరకు శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో లక్ష్మీపూజ * శ్రావణమాసంలో సకల శుభాలను కలిగించే పసుపు కొమ్ములతో శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి పూజ.... శ్రావణ మాసంలో ప్రతి రోజు పూజ ఇంట్లో చేసుకునే మహాలక్ష్మిఅమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి.. ఈ పసుపు కొమ్ముల పూజను శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి ప్రారంభించాలి. మాసం మొత్తం చేయాలి. ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ నెల రోజులు గడపకు పసుపు కుంకుమా పెట్టాలి... అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవాలి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను నెల రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి లక్ష్మిఅష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి నెల రోజులు ప్రతి రోజూ అష్టోత్తరం చదవాలి.. అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ నెల రోజులు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా నెల రోజులు అదే పసుపుకొమ్ములు వాడాలి.. ఆఖరి రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు వేయించుకుంటే మంచిది.. మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. *నియమాలు* ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ నెల రోజులు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు రోజూ తలస్నానమ్ చేయాలి (బ్రహ్మచర్య నియమం లేదు కనుక). అవివాహితులు మంగళ, శుక్ర, నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం 9 లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఈ నెల రోజులు రోజూ కూడా రోజంతా శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు) #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🪔శ్రావణ మాసం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
529 views
20 hours ago
శ్రావణమాసంలో మనం వేసేముగ్గులు లక్ష్మీ ప్రదం శ్రావణ మాసంలో మనము ఇంటి బయట తులసి కోట వద్ద మరియు ఇంటిలో వేసే ముగ్గులు మహాలక్ష్మికి ఆహ్వానం పలికినట్లు గా భావించి ఆ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువుంటుంది. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి! యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి! దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ,అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు! ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి! నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు