hindu temples

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
470 views
23 hours ago
శని దోషాలను హరించే తిరునల్లారులో... దాగివున్న మహా నిధి "మరకత లింగం" ​హృదయంలో ఈశ్వరుడి ధ్యానంతో... ​పుదుచ్చేరి, కారైకాల్ సమీపంలో ఉన్న తిరునల్లారు దర్భారణ్యేశ్వర స్వామి దేవాలయం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శనీశ్వర భగవానుడే. కానీ, ఈ ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ అయిన దర్భారణ్యేశ్వరుని సన్నిధికి సమీపంలో, ముచుకుంద చక్రవర్తిచే ప్రతిష్ఠించబడిన ఒక అరుదైన "మరకత లింగం" (త్యాగరాజ సన్నిధి) ఉందనే విషయం చాలామందికి తెలియదు. ​ఈ లింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలు ఇవిగో. ​ఇంద్రుడు ఇచ్చిన కానుక: దేవేంద్రునిచే పూజించబడి, ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తికి బహుకరించబడిన అత్యంత పవిత్రమైన విడంగ లింగాలలో (స్వయంభూ లింగాలు) ఇది ఒకటి. ​అభిషేక అద్భుతం: ఈ మరకత లింగానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా, ఈ లింగానికి చేసే 'పన్నీటి అభిషేకం' ఎంతో ప్రసిద్ధి చెందింది. మరకత శిలపై పన్నీరు జారి పడేటప్పుడు కలిగే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ (కంపనాలు) మానసిక ఒత్తిడిని, ఆందోళనలను దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ​ప్రదోష పూజ మహిమ: ప్రదోష రోజుల్లో ఈ మరకత లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని చెబుతారు. ఏల్నాటి శని, అష్టమ శని వంటి శని దోషాల తీవ్రతను తగ్గించి, శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించే శక్తి ఈ పూజకు ఉంది. ​బుధ-శని కలయిక ఫలితం: తిరునల్లారు ప్రధానంగా శని క్షేత్రం అయినప్పటికీ, బుధునికి సంబంధించిన రత్నమైన మరకత (పచ్చ) లింగం ఇక్కడ కొలువై ఉండటం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక. ఈ లింగాన్ని పూజించడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి, భారీ లాభాలు చేకూరుతాయని, అలాగే బుద్ధి కుశలత (తెలివితేటలు) పెరుగుతాయని నమ్మకం. ​తిరునల్లారు వెళ్లే భక్తులు కేవలం శని భగవానుడిని మాత్రమే దర్శించుకుని తిరిగి రాకుండా, గర్భగుడిలో కొలువై ఉన్న ఈ దివ్యమైన మరకత లింగాన్ని కూడా దర్శించుకుని, స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి! #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.4K views
26 days ago
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది? శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది. కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
703 views
29 days ago
తెనాలి "దొంగ" రాముని గుడి, తెనాలి !!! కాటన్ దొర పుణ్యమా అని 1848లో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించగా, కెప్టెన్ అలెగ్జాండర్ ఆర్ 1880 దశకంలో తెనాలి తాలూకాలో కాలువలు త్రవ్వి క్రమబద్ధంగా నీటి వసతి కల్పించారు. తెనాలి పట్టణం మధ్యగా మూడు కాలువలు అనగా పంటకాలువ, పడవల కాలువ, పడమర కాలువలు వరుసగా ప్రవహించడం ఒక పెద్ద వింత..!!ఇలాంటి సౌభాగ్యం భారతదేశంలో మరే పట్టణానికి లభించలేదు. విచిత్రం ఏంటంటే, విజయవాడ నుండి నిజాంపట్నం వరకు నిరంతరాయంగా పడవలు తిరుగుతూండేవి. మనుషుల ప్రయాణం, సరకుల రవాణా పడవల పైనే సాగేది. పడవ నడిపేవారు, యాత్రికులు రాత్రిపూట విశ్రాంతి తీసుకోడానికి మతుకుమల్లి రఘోత్తమరాయుడు అనే పుణ్యాత్ముడు 1899లో కాలువ పడమర ఒడ్డున ఒక సత్రాన్ని నడిపేవారట. అప్పట్లో అది ఒక వింత అట!!!అయితే, కాలువ తూర్పు వైపున కూడా ఒక వింత జరిగింది. దాని గురించి ఇప్పటికీ కధలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అదే తెనాలి నడిబొడ్డున గల రామాలయం. తెలుగువారి ఆరాధ్యదైవం శ్రీరాముడు. అప్పటి వరకు తెనాలిలో రామాలయం లేదు. స్థలం అడిగితే, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరోజున, కొందరు యువకులు పూనుకుని రాత్రికి రాత్రే సీతారాముల విగ్రహాలను నేడు గుడి ఉన్న స్థలంలో ప్రతిష్టించారు. తదుపరి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఎవరి అనుమతి లేకుండా, దొంగతనంగా నిర్మించినందున దొంగరాముడి గుడి అనే పేరు వచ్చింది. ఆ ఆలయానికి దక్షిణ భాగంలో పట్టణవాసుల ఉపయోగార్థం బావిని త్రవ్వారు. ఈ బావి వర్తులాకారంగా గుడి ముందే ఉండేది. ఎత్తైన గిలకలు, గుండ్రని చష్టాతో కనువిందుగా, నిత్యం కోలాహలంగా ఉండేది. ఈ బావిని గాడి బావి అనేవారు. 1950 దశకంలో ఈ బావిలో దూకి ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నందున బావిని శాశ్వతంగా మూసి వేశారు. ఈ బావి గల ప్రాంతం గాడి బావి సెంటర్ గా ప్రసిద్ధి చెందింది.దొంగ రాముని గుడిగా పేరొందిన ఈ రామాలయం నేటికీ నిత్య ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉంది. కథనానికి ఆధారం: తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలు ప్రత్యేక సంచిక #తెలుసుకుందాం #గుళ్ళు #hindu temples #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు