ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯

P.Venkateswara Rao
654 views
1 months ago
#రాజకీయాలు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *ఉప ప్రధానిగా బాబు⁉️* MARCH 10, 2026🎯 మార్చి 3న యీ సబ్జక్టుపై జర్నలిస్టు వైయన్నార్ చేసిన వీడియో చూసినప్పుడు నవ్వుకున్నాను - వాట్ ఏన్ ఔటేరేజియస్ థాట్ అంటూ! సమయానికి సబ్జక్టేదీ దొరక్క యిది మొదలెట్టి వుంటారు అనుకున్నాను. తర్వాత చూస్తే ఎవిరీ వ్యాఖ్యాత వర్త్ హిజ్ సాల్ట్ (తెలుగులో ఉప్పూ, పత్రీ వున్న.. అనవచ్చా?) దాని గురించే మాట్లాడసాగారు. వాళ్లకీ కంటెంట్ లేమి సమస్యే కదా అనుకుని వూరుకున్నాను. నీతీశ్ రాజ్యసభకు వెళుతున్నాడని తెలిశాక చివరకు ఎబిఎన్ కూడా డిస్కషన్ పెట్టడంతో ఉలిక్కిపడ్డాను. 'ముఖ్యమంత్రి పదవికి లోకేశ్ అర్హుడు, పార్టీలో కొందరు సీనియర్లు మొహం ముడుచుకుంటే ముడుచుకోనివ్వండి, క్యాడర్ అంతా అతన్నే కోరుకుంటోంది, జాతీయ స్థాయిలో బాబు దేశానికి దిగ్దర్శనం చేయగలరు' వంటి కామెంట్స్తో ఎబిఎన్ ప్రోగ్రాం నడిచింది. ఈ కాంపెయిన్ దేనికి? అని ఆలోచిస్తే ఒక ఆలోచన తట్టింది. దాన్ని మీతో పంచుకోవడానికే యీ వ్యాసం. క్రికెట్లో లాగ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి నా థాట్ ప్రాసెస్ మాట ఎలా వున్నా బాబును ఉప ప్రధాని చేస్తే చేయవచ్చు కానీ యీ లోపుగా మనం తర్కించుకుంటే తప్పేమీ లేదు. వైయన్నార్ చెప్పినప్పుడు ఉపప్రధాని కావడానికి బాబు స్వామీజీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా అందరి ద్వారా మోదీకి రికమెండ్ చేయిస్తున్నారని చెప్పారు. ఇదంతా నాకు వింతగా తోచింది. మోదీ ఎవరి సిఫార్సూ పట్టించుకోని రకమని తోస్తుంది. ఆయనకో ప్రణాళిక వుంటుంది. దాన్ని చాలా ఓపిగ్గా, క్షుణ్ణంగా అమిత్ షా ద్వారా అమలు చేయిస్తాడు. పార్టీలో సీనియర్లందరినీ మార్గదర్శక మండలి పేరుతో మూల కూర్చోబెట్టాడు. ఒకప్పటి గురువు, సంరక్షకుడు ఆడ్వాణీకి కూడా అదే గతి. పార్టీలో ఎవరో ఒకరు తప్పకుండా చెప్పి వుంటారు - ఆయనకో మంచి పోస్టు యివ్వండి అని. ఈయన విన్నాడా? ఇక స్వామీజీలు చెప్తే మోదీ వింటాడా? గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్లను దగ్గరకు రానిచ్చేవాడా? రోడ్ల విస్తరణకు అడ్డు వస్తే గుళ్లు కొట్టేసేవాడు. వీళ్లందరూ వచ్చి గోల చేస్తే పట్టించుకునే వాడు కాదు. వాళ్లకు యీయన మీద మంటగా వుండేది. 2014 ఎన్నికలలో జాతీయ స్థాయిలో ప్రధాని పోస్టుకి వెళదామని అనుకున్నప్పుడే మోదీ వాళ్లతో రాజీ పడ్డాడు. వాళ్లు కూడా యింతకంటే మంచి ప్రత్యామ్నాయం లేదు అనుకుని చేతులు కలిపారు. వాజపేయి హయాంలో నాగపూరు ఆరెస్సెస్ హెడ్క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వెళ్లేవనేవారు. ఇప్పుడు అవేమీ లేవు. అప్పటి జనసంఘ కాదు, అప్పటి బిజెపీ కాదు, నేటి బిజెపి మోదీ-అమిత్ల బిజెపి. పేరుకే బిజెపి, లోపలంతా కాంగ్రెస్సే, ఉన్నవాళ్లంతా కాంగ్రెసు వాళ్లే అంటే అనవచ్చు. అధినాయకత్వం మాత్రం వీరిద్దరిదే. స్వామీజీలు కాదు, పీఠాధిపతులు కాదు, నాగపూరు వారు కాదు, ఎవరికైనా పైపై మర్యాదలే తప్ప, వారు చెప్పినట్లు మోదీ వినే ప్రశ్నే లేదు. అతని కాలిక్యులేషన్స్ అతనివి. ఇక వ్యాపారవేత్తలు చెపితే వింటాడా? ఎవరు వారు? అదానీ, అంబానీలా? చెప్పేటంత దమ్ముందా వాళ్లకు? అంబానీలకైతే ఒరిజినల్ స్ట్రెంగ్త్ వుంది కానీ, అదానీ బలమంతా మోదీ పుణ్యమేగా! తమకేదైనా కావలసి వస్తే వాళ్లు అడిగి తీసుకోవచ్చు, ప్రతిగా ఏదైనా చేసిపెట్టవచ్చు తప్ప రాజకీయంగా యిలా చేయండి, ఫలానా నాయకుణ్ని మీ డిప్యూటీగా వేసుకోండి అని చెప్పేటంత ధైర్యం వుంటుందా? అసలు తక్కిన మంత్రుల కార్యాలయాలన్నిటిని పిఎంఓయే శాసిస్తోందని, మంత్రులు తమ కిష్టమైన వారిని సెక్రటరీలుగా వేసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్తూ వుంటారు. ఈ పరిస్థితుల్లో ఎవరి తరఫునా రాయబారాలు చేసే సీను యీ వ్యాపారవేత్తలకు ఉంటుందని అనుకోలేము. ఇక బాబు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి.. అనే వాదనకు అర్థమే లేదు. తన పార్టీలో సీనియర్లయిన రాజనాథ్, నితిన్ వగైరాలకే దిక్కూదివాణం లేదు. వారందరూ మోదీ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నారు. బాబు సీనియారిటీ తన పార్టీలోనే కదా! అది ఒక ప్రాంతీయ పార్టీ. పార్లమెంటులో దాని సీట్ల సంఖ్య మారుతూ వస్తోంది. వందల సంఖ్యలో సీట్లున్న జాతీయ పార్టీలో సీనియారిటీతో దీన్ని పోల్చలేము. రాష్ట్రస్థాయి నాయకులలో కూడా 80 పార్లమెంటు సీట్లున్న యుపి వంటి రాష్ట్రాధిపతికి వున్న వేల్యూ 25 సీట్లున్న రాష్ట్రాధిపతికి వుంటుందా? ఈయనకున్న పాలనానుభవాన్ని ఉపయోగించు కోవడానికి.. అనుకుందామంటే, ఏ అనుభవం మందవి విరులా సీతారామను ఆర్థిక శాఖ వంటి కీలకమైన పదవి నిచ్చారు? పైనుంచి అన్నీ చూసుకోవడానికి మేమున్నాంగా అనే ధీమా మోదీది. దక్షిణాదిన బిజెపి బలపడాలంటే ఎవరో ఒక సౌత్ ఇండియన్ వెటరన్ను తీసుకోవాలి కాబట్టి.. అని కొందరన్నారు. బిజెపి ముఖ్య బలమంతా ఉత్తరం, పశ్చిమంలో వుంది. తూర్పున వ్యాపిస్తోంది. బిహార్, ఒడిశాలను గెలిచింది. దక్షిణాదిన బలం పుంజుకోలేక పోతోంది. 2029 నాటికి మూడు టెర్మ్లు వరసగా పాలించడం చేత ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడి సీట్లు 2024 కంటె తగ్గుతాయనుకుంటే నార్త్, వెస్ట్లను కన్సాలిడేట్ చేసుకోవాలి. వెస్ట్ నుంచి మోదీ, అమిత్లు ఎలాగూ వున్నారు. నార్త్ నుంచి యోగి లాటి వాణ్ని తీసుకుని వస్తే, అక్కడ సీట్లు పెరుగుతాయి. ఎంబిసిలకు హితుడు, స్వయంగా బిసి ఐన నీతీశ్ను తెస్తే తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సీట్లు పెరగవచ్చు. అబ్బే, దక్షిణాది నుంచి తేవాలి అనుకుంటే యెడియూరప్పను తెస్తే కర్ణాటకలో మళ్లీ అధికారం రావచ్చు. కానీ ఆ ప్రభావం పక్క రాష్ట్రాలపై పడదు. తమిళనాడు, కేరళలలో పార్లమెంటు సీట్లు సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. తెలంగాణ నాయకుణ్ని తీసుకుంటే ఆ రాష్ట్రంలో కొంత మేలుండవచ్చేమో కానీ అక్కడున్న సీట్లు 17 మాత్రమే! ఇక ఆంధ్ర నుంచి తీసుకుంటే ఏ లాభమూ కలగదు. అక్కడ యిప్పట్లో బిజెపి బలపడే అవకాశమే కనబడటం లేదు. అది ప్రతిపక్షమా అంటే ప్రతిపక్షమూ కాదు, పోనీ అధికార పక్షమా అంటే అదీ కాదు. టిడిపి చేసే ఏ పనికీ అది క్రెడిటూ తీసుకోదు, డిస్క్రెడిటూ తీసుకోదు. కెటలిస్టు చూడండి, రసాయనిక చర్యను వేగవంతం చేస్తుంది కానీ అది స్వయంగా ఏ మార్పుకీ గురవదు. కూటమి అధికారంలోకి రావడానికి బిజెపి, ఇసి ద్వారా సహకరించింది కానీ యిప్పటికీ దాని బలంలో ఎదుగుదల, తరుగుదల ఏమీ లేదు. గొంగళీ అక్కడే వుంది. మంచీచెడూ ఏం జరిగినా టిడిపి పేరే జరుగుతోంది. బాబుని ఉపప్రధానిగా చేస్తే దాన్ని బాబు ఘనతగానే తెలుగు మీడియా ప్రచారం చేస్తుంది, ఆంధ్ర జనాలూ అదే నమ్ముతారు కానీ బిజెపి దక్షిణాది వారిని ఫేవర్ చేసిందనే కోణం ఎక్కడా ప్రొజెక్ట్ కాదు. పైగా బాబుది అగ్రకులం. తక్కిన రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపని కులం. ఇక బిజెపి బావుకునేదేముంది? ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే బాబును అంత కీలకమైన పదవిలోకి మోదీ తీసుకుంటారా అనేది ప్రధానమైన ప్రశ్న. తక్కిన ఆంధ్రనాయకుల సంగతి వేరు, బాబు సంగతి వేరు. ఆయనకు కుడిఎడమా లేదు. లెఫ్టాట్, రైట్ లెఫ్ట్, ఎబౌట్ టర్న్, రైట్లెఫ్ట్ యిలా ఆయన ప్రయాణం సాగింది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గానూ, ఎన్డీఏ కన్వీనర్ గానూ అప్పట్లో వున్న జాతీయ, ప్రాంతీయ నాయకులందరితోనూ ఆయనకు సంబంధబాంధవ్యా లున్నాయి. ఆ విషయంగా మోదీ కంటె ఎక్కువ ఎక్స్పోజరుంది. ఈయన్ని దిల్లీ తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే.. యీయన ఎవరితోనైనా సరసాలాడి, తనకు ఎసరు పెట్టగలడు అనే భయం మోదీకి వుండదా? మోదీకి అస్సలు పడని వ్యక్తి రాహుల్ గాంధీ. కాంగ్రెసు వ్యతిరేకత అనే ప్రాతిపదికపై పుట్టిన పార్టీ ఐనా, తెలుగుదేశాన్ని 2018 ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెసుతో బాహాటంగా, 2023లో చాటుగా ముడి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కూడా బాబు-రేవంత్-రాహుల్ బంధం నడుస్తోందని నమ్మవచ్చు. జగన్ అన్నాడని కాదు. ఆంధ్రలో 12శాతం ఓటింగు పెంచేసిన ఇసి అక్రమాలపై రాహుల్ ఎందుకు నోరు విప్పడు? గతంలో సరే, యిప్పుడు పరకాల ప్రభాకర్ రచ్చరచ్చ చేసిన తర్వాతైనా రాహుల్ అంది పుచ్చుకోవాలి కదా! ఆంధ్రకు వచ్చేసరికి రాహుల్ కిమ్మనడు. మోదీ వద్ద ఉపప్రధాని అనగానే నాకు ‘నరేంద్రుడి వద్ద ఉపేంద్రుడా!?' అనిపించింది. నరేంద్ర మోదీ సాక్షాత్తూ ఇంద్రుడి వంటి వాడు. దేవాధిదేవుడు. ఆరుద్ర గారు 'ఇంటింటి పజ్యాలు'లో రాస్తారు - 'జపాన్లో దేవుడంత గొప్పవాడు హీరోహిటో, మా యింట్లో నా పరిస్థితి డిటోడిటో' అని. మోదీది కూడా ప్రస్తుతం అదే స్థాయి. మోదీని కాస్త విమర్శించినా మీదపడి కరిచేసే వాళ్లు కోట్లలో వున్నారు. ఆయన వద్ద ఉప పోస్టు అంటే ఉపేంద్రుడన్నమాట. ఉపేంద్రుడంటే విష్ణువు మరో పేరు. వామనావతారంలో ఇంద్రుడి తల్లి అదితికి పుట్టటం చేత ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. శంకరుడంటే బోళావాడు. కానీ విష్ణువు టక్కరి. సమయానికి తగు మాటలాడి, తగు వేషం కట్టగలడు. జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసులనూ, దేవుళ్లనూ కూడా ఆకట్టుకోగలడు. బాబు ఉపప్రధాని అయితే సాక్షాత్తూ ఉపేంద్రుడవుతాడన్న భయం మోదీ కుండదా? అలాటి భయం ఆయనకుంటుందని బాబు ఊహించలేరా? ఈ కారణాల చేత ఇదంతా ఉత్తుత్తిదే అనుకుని వూరుకున్నాను. కానీ తర్వాత ప్రతి వారూ యీ సబ్జక్టుపై మాట్లాడసాగారు. లోకేశ్ను ముఖ్యమంత్రి చేయడం అనివార్యం కాబట్టి, ఆరోగ్యంగా, చురుగ్గా వున్న బాబు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి జాతీయ రాజకీయాలకు వెళతారని అనసాగారు. ఎబిఎన్ ప్రోగ్రాంలో లోకేశ్కు పార్టీలో కొందరు సణుగుడు సీనియర్లు తప్ప అందరూ మద్దతిస్తున్నారని, ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పేశారు. ఇక బాబు మార్గదర్శకత్వం మోదీకి ఆవశ్యకమనే టోన్లో కూడా మాట్లాడారు. గతంలో వాజపేయి - ఆడ్వాణీ హయాంలో బాబు చక్రం తిప్పిన సంగతులన్నీ ఏకరువు పెట్టారు. కానీ ఆ ద్వయం హయాం వేరు, యీ ద్వయం హయాం వేరు. ఈ ద్వయానికి మొహమాటాలు లేవు. మొన్న 2024 ఎన్నికలకు ముందు కూడా చూడండి. పొత్తు అవసరం తమకుండి కూడా సై అనడానికి ఎంతకాలం టిడిపిని వెయిట్ చేయబెట్టారో! అలాటిది బిజెపి సీనియర్లందరినీ పక్కన పెట్టి బాబుకి యింత పెద్ద పీట వేస్తారా? ఉప ప్రధాని పోస్టు అంటే ఆరో వేలు లాటి ఉప ముఖ్యమంత్రి పోస్టు లాటిది కాదు. జనతా పార్టీ హయాంలో మొరార్జీ, చరణ్ యిద్దరూ చెరో వైపు లాగుతూ, ముఖాముఖీ సమావేశమయ్యేవారు కాదు. వాజపేయి, ఆడ్వాణీ దశాబ్దాలుగా మిత్రులు కాబట్టి గొడవలు రాలేదు. చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, 'ఇండియా షైనింగ్' నినాదాన్ని ఎత్తుకోవడం విషయంలో మనస్పర్ధలు వచ్చాయి కానీ బయట పడలేదు. బాబు- మోదీల మధ్య వైరుధ్యాల గురించి యిప్పుడు మళ్లీ రాయడం అనవసరం. ప్రస్తుతం మోదీ టిడిపి ఎంపీల మద్దతుపై ఆధారపడ్డారు కాబట్టి బాబు అడిగినది యివ్వక తప్పదు.. అనే వాదనకూ బలం లేదు. ఈడీ వంటి బ్రహ్మాస్త్రం తూణీరంలో వున్న మోదీ తలచుకుంటే 16 మందిలో 12 మంది యిటు వచ్చేసి పార్టీ చీల్చేయగలరు. 2019 జూన్లో 6గురు టిడిపి రాజ్యసభ ఎంపీల్లో నలుగురు బిజెపిలోకి దుమికేస్తే బాబు ఏం చేయగలిగారు? బాబుపై చర్చ నడుస్తూండగానే నీతీశ్ స్థానచలనం న్యూస్ వచ్చింది. కిక్డ్ అప్లైయిర్స్ అంటారే అలాటిది జరిగి, ముఖ్యమంత్రి పదవి వూడగొట్టి రాజ్యసభకు పంపించారు. మీ అబ్బాయికి ఉప ముఖ్యమంత్రి పదవి యిస్తాంలే అన్నారట. నీతీశకు ఏ పదవి యిస్తారో క్లారిటీ లేదు. 'బాబుకీ అలాగే చేస్తారు. ఎటొచ్చీ లోకేశ్కు ముఖ్యమంత్రి పదవి యిస్తారు' అనసాగారు. నీతీశ్కు సొంత బలం తక్కువ. పైగా అనారోగ్యం. అతన్ని తప్పిస్తే బిజెపి మనిషి ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రలో పరిస్థితి అది కాదు. బాబును తప్పించినా బిజెపికి ఏమీ దక్కదు. తప్పించి లాభమేమిటి? కేంద్రంలో మంత్రి పదవి అన్నా, ఏదైనా రాష్ట్రానికి గవర్నరు గిరీ అన్నా బాబు స్టేచర్కు అది తక్కువ. ఆయన స్థాయి దించినట్లే! ఇస్తే ఉపప్రధాని పదవి యివ్వాలి. నీతీశ్కి కూడా బాబు వంటి లెఫ్ట్ట్, ఇన్ ద పాండ్- ఆన్ ద బ్యాంక్, ట్రాక్ రికార్డే! ముఖ్యమంత్రిగా నీతీశ్ బాబు కంటె నాలుగేళ్లు ఎక్కువ వున్నాడు. అతనికి ఆ పోస్టు యివ్వకుండా బాబుకిస్తే ఆయనూరుకుంటాడా? లేక యిద్దరికీ యిస్తారా? ఇద్దరికీ యిస్తే బిజెపి ఆశావహులు వూరుకుంటారా? ఆంధ్రలో డిప్యూటీ సిఎంల లాగ అక్కడా ఐదారుగురు డిప్యూటీ పిఎంలను పెడతారా? ఇన్ని ప్రశ్నలుండగా బాబు గురించిన యీ న్యూస్ ఎలా, ఎవరు చర్చకు వచ్చింది? నీతీశ్కి జరిగింది చూశాక నాకొక వైల్డ్ థాట్ వచ్చింది. బిహార్ నుంచి నీతీశ్ను తప్పించినట్లుగా ఆంధ్ర నుంచి బాబుని తప్పించాలని బిజెపి చూస్తోందేమో! బాబు వంటి మఱి చెట్టు నీడ ఆంధ్రలో బిజెపి ఎదగడం కల్ల. అందుకని ‘లోకేశ్ను సిఎంగా చూడడం మీ కల కాబట్టి, అది నెరవేర్చుకుని, మీరు దిల్లీ వచ్చేయండి.' అని బిజెపి చంద్రబాబుకి కబురంపిందేమో! 'నేను దిల్లీ రావడమంటూ జరిగితే, ఉపప్రధాని పదవి చేపట్టడానికే రావాలి కానీ అల్లాటప్పా మంత్రి పదవి తీసుకోవడానికి రావడం కుదరదు.’ అనే సందేశం బిజెపి కేంద్ర నాయకత్వానికి యివ్వడానికే బాబు యిలాటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారేమో! లేకపోతే యిది అసలు చర్చించదగిన విషయమే కాదు. 2029 లోగా బాబు లోకేశ్ను సిఎం చేస్తారనేది అందరూ అనుకునే మాటే! దానికి పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పరని కూడా సులభంగా గ్రహించవచ్చు. కాపు కులస్తుడు సిఎం కావాలని కాపు నాయకులు, పవనే సిఎం కావాలని అతని అభిమానులూ ఎంత గాఢంగా అనుకున్నా పవన్కి అంత పట్టింపు లేదు. స్క్రిప్టు ప్రకారం నడుచుకునే నటుడాయన. స్థానిక బిజెపి పన్నెత్తి పలికే పరిస్థితి లేదు. లోకేశ్ను గద్దెపై కూర్చోబెట్టి ఎక్కడికైనా వెళ్లిపోదామని బాబు అనుకోరు. పిల్లాణ్ని సైకిలు మీద కూర్చోబెట్టిన తండ్రి అలా వదిలేసి వెళ్లిపోడు. వాడికి సరిగ్గా బాలన్సింగ్ వచ్చేవరకూ కారేజి పట్టుకుని కాసుకుంటూ, దారిలో అవరోధాలను తప్పిస్తూ వుంటాడు. టిడిపి సైకిలు మీద లోకేశ్ను కూర్చోబెట్టాక, బాబు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ, లోకేశ్కు పాలనానుభవం కలిగేట్లా, సొంత యిమేజి ఏర్పరచుకునేట్లా పర్యవేక్షిస్తారు. ప్రధానిగా దిగాక కర్ణాటకలో దేవెగౌడ చేసినదదేగా ! ఇప్పుడు బిజెపి యీయన్ని ఢిల్లీకి మకాం మార్చమంటే, లోకేశ్ డైరక్టుగా జగన్తో పోటీ పడాల్సి వుంటుంది. పర్యవసానాలు ఎలా వుంటాయో ఎవరూ చెప్పలేరు కానీ, ప్రయాణమైతే సాఫీగా సాగదని అనవచ్చు. అందువలన బాబు దగ్గరే వుండి కాపు కాసుకోవాలనే చూస్తారు. అలా అయితే టిడిపి స్థానంలోకి తాము ఎప్పటికీ రాలేమని భయంతోనే బిజెపికి యీ ఆలోచన వచ్చి వుండవచ్చు. దాన్ని మొగ్గలో తుంచడానికి బాబు యీ అస్త్రం సంధించి వుండవచ్చు. చివరకు ఏమౌతుందో తెలియదు. వెంకయ్యనాయుణ్ని ఉపరాష్ట్రపతిగా చేస్తారట అనే పుకారు వచ్చినప్పుడు, యాక్టివ్ రాజకీయాలు వదులుకోవడానికి యిష్టపడని వెంకయ్య 'నేను ఉషాపతినే తప్ప, ఉపరాష్ట్రపతిని కాను' అని స్టేటుమెంటు యిచ్చారు. మోదీ చిరునవ్వు నవ్వి, ఆయనకు రెండోదీ ప్రసాదించారు. వెంకయ్యకు గత్యంతరం లేకపోయింది. నరేంద్రజాలాన్ని తట్టుకోవడం ఆ నాయుడికైనా, యీ నాయుడికైనా కష్టమే! (ఫోటో – మోదీ, బాబు, నీతీశ్) *ఎమ్బీయస్ ప్రసాద్*
P.Venkateswara Rao
831 views
1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *మహిళలకు చంద్రబాబు వరాల డ్రామా❗* MARCH 9, 2026🎯 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. ఇలాంటి ఆర్భాటాలను ఎలా సెలబ్రేట్ చేయాలో బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ వేడుకల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికల ప్రకారం.. ఈ సందర్భంగా.. చంద్రబాబు మహిళలకు మహాగొప్ప వరాలను ప్రకటించారు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, ఎమ్మెల్యేలయ్యేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. అలాగే.. గ్యాస్ ధరలు పెరిగినా కూడా.. ఏడాదిలో మూడు సిలిండర్ల పథకాన్ని యథాతథంగా కంటిన్యూ చేయనున్నట్టుగా కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇంతకు మించిన వరాలు ఆయన వద్ద మరేమీ లేవేమో అనిపించేలా.. కొన్ని పత్రికల పతాకశీర్షికల్లో ఇవే కనిపిస్తున్నాయి. అసలు ఈ వరాల్లో చంద్రబాబు మహిళాలోకానికి కొత్తగా ఒరగబెడుతున్నది ఏముంది? అదే సమయంలో, మూడేళ్లకిందటి హామీని అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా తొక్కిపట్టేసి మహిళల పట్ల సాగిస్తున్న వంచన మాటేమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి. మహిళలు ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలనేది కూడా ఒక హామీనేనా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కినంత మాత్రాన.. అందులో చంద్రబాబు పాత్ర ఏమైనా ఉందా? తాను వ్యతిరేకించినా కూడా నెగ్గగల బిల్లుకు తన పార్టీ ఎంపీలతో అనుకూలంగా ఓటు వేయించడం తప్ప.. ఆయన చేసినది ఏముంది? కేంద్రం పూనికతో 33 శాతం రిజర్వేషన్లు చట్టరూపం దాల్చగా.. అదేదో తాను చేసిన గొప్పపని అన్నట్టుగా.. మహిళలు ఎమ్మెల్యే కావడానికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం చేసిన చట్టం అమలయ్యేలోగా.. మహిళలకు చంద్రబాబు అదే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనను నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు. ఫరెగ్జాంపుల్.. ఆ చట్టం గత ప్రభుత్వ హయాంలోనే అయింది గనుక.. 2024 ఎన్నికల్లోనే చంద్రబాబు గనుక.. తన పార్టీ తరఫున 33 శాతం టికెట్లు మహిళలకు ఇచ్చి ఉంటే.. మహిళాలోకం ఆయనకు నీరాజనాలు పట్టిఉండవచ్చు. పోనీ.. కేబినెట్ లో 33 శాతం బెర్తులు మహిళలతో భర్తీచేసి ఉంటే అదైనా గౌరవంగా ఉండేది. అవేమీ చేయకుండా.. మహిళా దినోత్సవానికి అదే తన పెద్ద హామీ అన్నట్టుగా చంద్రబాబు చెప్పడం కేవలం డ్రామానే అని ప్రజల అభిప్రాయం. 2023 మేలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించారు చంద్రబాబునాయుడు. ఇంకో నెల గడిస్తే.. మూడేళ్లు పూర్తవుతాయి. అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తున్నాయి. ఆ పథకానికి ఇప్పటిదాకా అతీగతీ లేదు. రాష్ట్రంలో అర్హురాలైన ప్రతి మహిళకు రూ. 1500 నెలకు ఇవ్వాలనేది ఆ పథకం. మహిళాదినోత్సవం నాడు ఆ పథకాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేది. లేదా, కనీసం ఫలానా తేదీనుంచి ప్రారంభిస్తాం అని ప్రకటించి ఉంటే మర్యాదగా ఉండేది. దానిని మరుగున పెట్టేసి.. సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేశాం.. అవన్నీ సూపర్ హిట్ అయిపోయాయి.. అని అబద్ధాల డప్పు కొట్టుకుంటూ చంద్రబాబు మాయచేస్తున్న తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.
P.Venkateswara Rao
620 views
1 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *జగన్ పై మతాస్త్రం.. లాభనష్టాలెవరికి❓* MARCH 7, 2026🎯 సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా తప్పుదారిలో పయనిస్తున్నారు. హిందువుల వ్యతిరేకిగా వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముద్ర వేసి రాజకీయంగా భారీ లబ్ధి పొందాలనేది చంద్రబాబు అండ్ కో వ్యూహం. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుకు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులే చిత్తయ్యారు. చంద్రబాబు మాస్ లీడర్ కాదు. కానీ తెలివితేటలతో గత నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. బాబు వేసిన ఎత్తులకు మహామహులు చిత్తయ్యారు. అయితే వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి, ఒక్కోసారి ఆయన వ్యూహాలు నిష్ఫలం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో దుష్ప్రచారంతో తమను ఓడించారని చంద్రబాబుపై వైఎస్ జగన్, వైసీపీ నాయకుల ఆరోపణల గురించి తెలిసిందే. కానీ వైసీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలన్న చంద్రబాబు శకుని పాచిక పారడం లేదు. చంద్రబాబు గొప్పతనం ఏమంటే, తన ప్రయత్నాల్ని ఎప్పుడూ విరమించరు. ప్రయత్నిస్తూ వుంటే, ఎప్పుడూ ఒకసారైనా సత్ఫలితాలు ఇవ్వకుండా వుంటుందా? అనే నమ్మకం ఆయనది. వైఎస్ జగన్పై కొన్నేళ్లపాటు సాగించిన అవినీతి ఆరోపణలకు కాలం చెల్లిందని చంద్రబాబు గుర్తించారు. దీంతో జగన్పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్పై మతాస్త్రాన్ని ప్రయోగించారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్లారు. తమపై విసిరిన మతాస్త్రాన్ని ఎదుర్కోవడంలో మొదట్లో వైసీపీ ఇబ్బంది పడింది. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణంతో మొదలైన ఎదురు దాడి... క్రమంగా పెంచింది. చివరికి సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదికతో వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది. అయితే మతాస్త్రంతో రాజకీయంగా భారీ లబ్ధి పొందుతామని అనుకుంటే, బూమరాంగ్ కావడం టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులందరినీ మతం దృష్టితోనే చూడడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలు జనంలో టీడీపీ, జనసేన పార్టీలపై వ్యతిరేకత తెచ్చి పెడుతున్నాయి. శాసన మండలిలో చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అంటూ అనవసరంగా కెలికారు. దీంతో మండలి చైర్మన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మతం గురించి మీరెలా చెబుతారని మోషేన్రాజు గట్టిగా నిలదీశారు. తాను హిందువని ఆయన తేల్చి చెప్పారు. దీంతో మండలిలో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. మరోవైపు జగన్ క్రిస్టియనో, కాదో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డగోలు వాదన చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు చంద్రబాబునాయుడు మరోసారి మతం కేంద్రంగా కీలక కామెంట్స్ చేశారు. ఏసు ప్రభువుకు అపచారం జరిగిందంటే జగన్ క్షమాపణలు చెప్పారన్నారు. వెంకటేశ్వరస్వామికి కల్తీ చర్యలతో అపచారం చేస్తే దానికి సమాధానం చెప్పరా? క్షమాపణలు చెప్పరా? కనీసం పశ్చాత్తాపమైనా ఎందుకు ప్రకటించరని చంద్రబాబు నిలదీశారు. మతపరంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని పరిగణలోకి తీసుకుని, మతపరమైన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనేది పాలకుల ఎత్తుగడ. అయితే జగన్ క్రిస్టియన్ కావడంతో ఏదో అపచారం చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు చేసే నిందారోపణలు నమ్మి, హిందువులంతా వైసీపీకి దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ పాలకుల ఆరోపణలతో క్రిస్టియన్, ముస్లిం తదితర మైనార్టీలంతా కూటమికి దూరం కావడం ఖాయం. అలాగే దళితులు, గిరిజనుల్ని కూడా వైసీపీకి చేరువ చేయడంలో కూటమి నేతలు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అంటే, చంద్రబాబు, పవన్ ఆడుతున్న మత వికృత క్రీడలో తామే రాజకీయంగా నష్టపోతున్నామనే గ్రహించలేకున్నారా? లేక మొండిగా ముందుకు వెళుతున్నారా? అనే విషయాలు వారికే తెలియాలి. తెలుగు సమాజం మతపరంగా విడిపోయేంత అజ్ఞానంలో లేదు. ఇటీవల కోవా బన్ వలీ విషయంలో హిందువులంతా ఆ పేద చిరు వ్యాపారికి ఎంత అద్భుతంగా అండగా నిలిచారో తెలిసిందే. అలాంటిది అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్పై చంద్రబాబు, పవన్కల్యాణ్ ఏ ఉద్దేశంతో మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో జనం లేరు. హిందువుల్లో జగన్పై వ్యతిరేకత రాకపోగా, రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారి తమ మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడ్తారా అని చంద్రబాబు, పవన్పై హిందువులు ఆగ్రహించే పరిస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ కంటే, తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవనే ప్రజల్లో ఎక్కువగా అభాసుపాలయ్యారు. ఈ వాస్తవాన్ని పసిగట్టడం వల్లే చంద్రబాబు, పవన్లో ఓర్వలేనితనం పెరిగింది. తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు, మరిన్ని చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తెలుగు సమాజం మత వలకు చిక్కదని ఏపీ పాలకులు తెలుసుకోవాలి. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోడానికి మరో అస్త్రాన్ని ఎంచుకోవాలి. మరే అస్త్రాలు లేకపోవడం వల్లే మతాన్ని ఎంచుకున్నామని అనుకుంటే, అది పూర్తిగా తప్పుడు విధానం అని... ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచైనా తెలుసుకోవాలి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంపై జుగుప్స కలిగించే ఆరోపణల్ని ఆపాలంటూ ముక్త కంఠంతో తెలుగు సమాజం కోరుతున్నదంటే, మన మాటలు ఎంత వెగటు పుట్టించాయో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్కు హిందువులు దూరం కాకపోగా, సానుభూతి పొందగలిగారు. అలాగే పదేపదే జగన్ మతం గురించి పాలకులు మాట్లాడుతుండడంతో దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలంతా వైసీపీకి మరింత దగ్గరయ్యారు. ఎందుకంటే, గత ఎన్నికల్లో వీళ్లలో మెజార్టీ కూటమి పక్షాన నిలిచింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరోవైపు హిందువుల్ని తమవైపు తిప్పుకోలేకపోగా, వారిలో కూడా వ్యతిరేకతను కూటమి సంపాదించుకుంది. చేతులు కాలాక చంద్రబాబు, పవన్ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
P.Venkateswara Rao
566 views
1 months ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా చాటి చెప్పిన పవన్కల్యాణ్❗* MARCH 6, 2026🎯 వైసీపీపై విమర్శలు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటారు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా ఆయన ద్వేషిస్తున్నట్టుగా, ఆయన విమర్శలుంటాయి. ఈ నేపథ్యంలో వైసీపీని విమర్శించే క్రమంలో ఆ పార్టీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్కల్యాణ్ బయటపెట్టారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికీ వాళ్లకు (వైసీపీ) సభ్యులు తక్కువే అన్నారు. 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతుంటారన్నారు. ఇదే సందర్భంలో వారు చెప్పే విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా చెప్పుకోవడంలో విఫలమవుతోందన్నారు. వైసీపీ నాయకులు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మాట్లాడే స్వేచ్ఛను ఇతరుల్ని దూషించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే వైసీపీ నాయకులు తమ తప్పుల్ని దాచిపెట్టి ఇతరులపై ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత కులాల వెనుక దాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కామెంట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఇటీవల కాలంలో కూటమి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరీ ముఖ్యంగా భయం అంటే ఏంటో తెలియదన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అయితే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహా అయితే కేసులు, లేదంటే జైలుకు పంపుతారని, ఇంతకంటే ఏం చేస్తారనే ధిక్కార స్వరం పెరిగింది. ఇదే పవన్కు ఆందోళన కలిగిస్తున్నట్టుంది. వైసీపీ ఎంత బలంగా వుందో, ఆ పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో పవన్ బయటపెట్టడం జోష్ నింపుతోంది.
P.Venkateswara Rao
713 views
1 months ago
#తిరుమల తిరుపతి #ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *తొలగించండి బాబూ.. పోయేది మీ పరువే❗* MARCH 2, 2026🔱 ప్రపంచంలోనే అత్యున్నతమైన ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు పేరుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటద్రీశుని పాలకమండలికి సారథ్యం వహించడం అంటే.. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ.. దక్కే బాధ్యత కాదని అందరూ పరిగణిస్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో కేవలం.. రాజకీయ పైరవీలు, రాజకీయ ప్రాపకాలు మాత్రమే ఈ పుణ్యపదవిని దక్కించుకోవడానికి ప్రాతిపదిక అయిపోతున్నాయి. ఆ క్రమంలోనే ఆ పదవిని దక్కించుకున్న వ్యక్తి బిఆర్ నాయుడు. తనకున్న టీవీఛానెల్ ద్వారా.. జగన్ మీద బురద చల్లడమే జీవితంగా గడిపి, తద్వారా చంద్రబాబు గద్దె ఎక్కడానికి తన వంతు సాయం చేసి, క్విడ్ ప్రోకో గా టీటీడీ ఛైర్మన్ పదవిని పొందారు. అప్పటినుంచి అనేక వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతున్నారు. తాజాగా ఆయన ఒక మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సహజంగానే వైరల్ అయింది. వైసీపీ నాయకులు దీనిని అందింపుచ్చుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కూడా.. ఎలాంటి అత్యున్నత ధార్మికమైన పదవిలో ఎలాంటి వారిని కూర్చోబెట్టారో చంద్రబాబు ఆత్మసమీక్ష చేసుకోవాలంటూ.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. తన బండారాన్ని కడిగిపారేస్తున్న భూమన పట్ల బిఆర్ నాయుడుకు కక్ష ఉండడం సహజం. రాసలీలల వైరల్ వీడియో కు కౌంటర్ ఇవ్వడంలో కూడా బిఆర్ విఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రాసలీలల వీడియో విషయంలో బిఆర్ నాయుడు మాటలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఆయన ఒక మహిళతో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్న దృశ్యాలు వైరల్ అయిన వీడియోలో ఉన్నాయి. అయితే బిఆర్ దీనిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మహిళ కుటుంబంతో తమ కుటుంబానికి ముప్ఫయ్యేళ్లుగా పరిచయాలు ఉన్నాయని, ఒకరి ఇంటికి మరొకరు వస్తూ పోతూ ఉంటామని అంటున్నారు. పరిచయం ఉండడాన్ని ఎవరూ తప్పు పట్టరు కదా.. తప్పు జరుగుతున్నట్టుగా వీడియోలో ఉన్నందువల్ల మాత్రమే అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే బీఆర్ నాయుడు ఒకవైపు ఆ వీడియోను నేను చాలా సార్లు చూశాను. అందులో తప్పు ఏముంది? అసభ్యకరమైనది, అశ్లీలమైనది ఏమీ లేదని అంటున్నారు. అలా అంటూనే.. కొన్ని చోట్ల ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. వీడియో ఆధారాలు బయటపడినప్పుడు.. ప్రతివాళ్లూ మార్ఫింగ్ అని, డీప్ ఫేక్ అని మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మార్ఫింగ్ చేసినదే నిజమైతే గనుక.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు చేస్తారు? ఇంకా ఘాటైన రాసలీలు ఉండేట్టుగా మార్ఫింగ్ చేస్తే ఇంకా బద్నాం చేయవచ్చు కదా.. అనేది ప్రజల సందేహం. బిఆర్ నాయుడు పరస్పర విరుద్ధ మాటలతో తానే దొరికిపోయేలా చేస్తున్నారు. తమ పార్టీ వారి రాసలీలు, అసభ్యపు చేష్టలు బయటకు వస్తే.. కూటమి పార్టీల నాయకులు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు.. అనే వారి నైతిక విలువలకు బిఆర్ వ్యవహారం ఒక లిట్మస్ టెస్టుగా మారనుంది. దేవదేవుడి సేవలో ఇలాంటి తుచ్ఛులను నియమిస్తే.. అది కూడా దైవద్రోహమే అవుతుందని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి. వీడియోలోని రాసలీలలను ప్రస్తావిస్తూ.. కొన్ని భాగాలు మార్ఫింగ్ చేశారని బిఆర్ అంటున్నారు. మార్ఫింగ్ అవునో కాదో ఫోరెన్సిక్ పరీక్షల్లో చాలా సునాయాసంగా తేలిపోతుంది. కనీసం అది మార్ఫింగ్ అని తేలేవరకు బిఆర్ ను ఆ పదవినుంచి పక్కన పెడితే.. చంద్రబాబునాయుడుకు కూడా వేంకటేశ్వరస్వామి పట్ల భక్తి ఉన్నట్టు నిరూపణ అవుతుంది. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా సరే.. తను చేసిన పనిలో తప్పు లేదని విశ్వాసం ఉన్నా సరే.. బిఆర్ నాయుడు.. తన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలలో వీడియో మార్ఫింగ్ సంగతి తేల్చేవరకు దేవుడి సేవకు దూరంగా ఉంటానని రాజీనామా చేయాలి. లేకపోతే చంద్రబాబు పరువు మాత్రమే కాదు, మొత్తంగా కూటమి పరువేపోతుంది. ఇప్పటికే జనసేన పార్టీ ఎలాంటి రాసలీలల ఎమ్మెల్యేలతో భ్రష్టుపడుతున్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ రాసలీలలు.. తెలుగుదేశం పార్టీని కూడా భ్రష్టుపట్టించబోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
P.Venkateswara Rao
538 views
1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..⁉️* February 27, 2026🎯 త్వరలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా..? తొందరపడుతున్నాడా..? మరి చంద్రబాబు ఏం చేయాలి..? అసలు దీనికి పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాడా..? కూటమిలోని బీజేపీ ఏం చెబుతుంది..? ఇదుగో ఈ చర్చ రీసెంటుగా జోరుగా సాగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో… దేశం కూడా చూస్తోంది… ఎందుకంటే..? టీడీపీ సపోర్టుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది, అందుకే టీడీపీ రాజకీయాలపై అందరికీ ఆసక్తి… 1) పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? ఈ ప్రశ్నకు సమాధానం… ‘తన అంగీకారంతో పనిలేదు’… చంద్రబాబు గనుక వారసుడి పట్టాభిషేకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక, టీడీపీ శాసనసభాపక్షం లోకేష్‌ను ఎన్నుకున్నాక పవన్ కల్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆగేదేమీ ఉండదు… ఒకవేళ కోపంతో, అసంతృప్తితో కూటమి నుంచి బయటికి వస్తే నష్టపోయేదీ తనే… తనెలాగూ జగన్‌తో కలిసి రాజకీయం చేయలేడు, కేవలం బీజేపీ ప్లస్ జనసేన కలిసి ప్రయాణించినా టీడీపీకి పెద్దగా నష్టమూ లేదు… లోకేష్‌తో సమన్వయం చేసుకుంటూ తన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేయాల్సిందే… ఆ కెమిస్ట్రీ తప్పదు… (లేదంటే దాసరికి, చిరంజీవికి గతంలో కేంద్రంలో చాన్స్ ఇచ్చినట్టు పవన్ కల్యాణ్‌ను కూడా ఢిల్లీకి రప్పించి, కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో…) 2) మరి చంద్రబాబు ఏం చేయాలి..? ఇదే అసలు ప్రశ్న… 75 ఏళ్లొచ్చినా చంద్రబాబు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు… చురుకుగా ఉన్నాడు… తను అధికారం లేకుండా, యాక్టివ్ పాలిటిక్స్ లేకుండా ఉండలేడు… కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా, ములాయంసింగ్ తదితరులు మరీ ముసలితనం పైనబడ్డాక గానీ కొడుకులకు పగ్గాలు ఇవ్వలేదు… బిజూ పట్నాయక్ వంటి నేతలు మరణించాక గానీ కొడుకు రాజకీయాల్లోకి రాలేదు… చాలా ఉదాహరణలున్నయ్… పోనీ, లోకేష్‌కు టీడీపీ ప్లస్ ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి (నిజానికి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పటికే లోకేష్ యాక్టింగ్ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసేసుకున్నాడు) ఢిల్లీకి ఏ రాజ్యసభ సభ్యుడిగానో వెళ్తే..? వెళ్లి ఏం చేయాలి మరి..? అక్కడేమీ ఖాళీలు లేవు, ఉత్త రాజ్యసభ సభ్యుడిగా తను చేయగలిగేదీ ఏమీ లేదు… ఉపరాష్ట్రపతి పదవి భర్తీ జరిగి చాన్నాళ్లు కాలేదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం వచ్చే ఏడాది జూలై దాకా ఉంది… పోనీ, అప్పటిదాకా ఆగి, చంద్రబాబును రాష్ట్రపతిని చేసి, అప్పుడు లోకేష్‌కు అధికారికంగా పగ్గాలు ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉందా..? అదేనా ఈ రీసెంటు చర్చ వెనుక సారాంశం..? కానీ రాష్ట్రపతి పదవి లెక్కలు వేరే ఉంటాయి, అదంత సులభమేమీ కాదు… ఏమో, మోడీ వర్సెస్ మోహన్ భగవత్ రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబును మరేదైనా కీలక పదవిలోకి అకామిడేట్ చేస్తారా..? చంద్రబాబు పొలిటిషియన్‌కన్నా గుడ్ మేనేజర్… అవకాశాల్ని సరిగ్గా వాడుకుంటాడు… ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు… ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పినా, ఇప్పుడు కేవలం విభజిత ఏపీకే పరిమితమై, కాలానికి తగినట్టు తగ్గి ఉంటున్నాడు… జనాకర్షణ శక్తి, మంచి వాగ్దాటి లేకపోయినా తన లౌక్యం, మేనేజింగ్ ప్రతిభలతోనే నెట్టుకొస్తున్నాడు… మామ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాజేసినా, జనంలో వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేసుకోగలిగాడు… కానీ లోకేష్ మేనేజింగ్ సామర్థ్యం…? ఏమో, వేచి చూడాల్సిందే… పార్టీ నాయకులు లోకేష్ నాయకత్వాన్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తారా అనేదీ సందేహమే… కాకపోతే తను గతంలో పప్పు ఇమేజ్ ఉన్న నాయకుడు మాత్రం కాదు, అన్నింట్లోనూ ఆరితేరుతున్నాడు… ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోసం ప్రత్యేకంగా విందులు, ఫ్యామిలీలకు పట్టుచీరెలు గట్రా ఓ తంతు స్టార్ట్ చేశాడు కూడా… 3) కొన్నేళ్ల క్రితం కేసీయార్ కూడా కేటీయార్‌కు ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి, తను తప్పుకుందామని ఆలోచించినట్టు వార్తలొచ్చాయి… ప్రధాని మోదీ కూడా ఏదో సభలో వెల్లడించినట్టు గుర్తు… కానీ తనకు పార్టీలో, ప్రజల్లో యాక్సెప్టెన్స్ అంతగా ఉందానే డౌట్ కేసీయార్‌ను వెనక్కి లాగిందేమో… ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో కూడా కేసీయారే పార్టీ అధినేతగా ఉన్నాడు… తన పేరే పార్టీకి తారకమంత్రం, కేసీయార్ రాజకీయాలు వదిలేస్తే (అఫ్‌కోర్స్, వదిలేసినట్టే) బీఆర్ఎస్ ఇప్పుడున్నట్టు కూడా ఉండలేదు… (కేటీయార్‌కన్నా హరీష్‌రావుకు పార్టీలో యాక్సెప్టెన్స్ ఎక్కువ)… సేమ్, టీడీపీ కూడా ఓ కుటుంబ పార్టీయే కదా, కుటుంబ ఆస్తి వ్యవహారాల్లాగే లోకేష్‌‌కు పగ్గాలు ఇవ్వాలని అనుకుంటే… తనకు నిజంగా జనంలో యాక్సెప్టెన్సీ ఉందా..? లభిస్తుందా..? ఇదీ డిబేటబుల్… 4) మరి బీజేపీ..? పెద్దగా పట్టించుకోకపోవచ్చు… జగన్‌తో కలిసి ప్రయాణించలేదు… సొంత బలం లేదు, ఉన్నంతలో టీడీపీకి తోకగా ఉండటం మినహా..! గత ఎన్నికల కూటమి మేనిఫెస్టోతో విభేదించినా, కలిసి వోట్లు అడగక తప్పలేదు… ఒకవేళ చంద్రబాబు గనుక గ్రీన్‌సిగ్నల్ ఇస్తే బీజేపీ హైకమాండ్ వోకే అనకుండా, చేయగలిగేది కూడా ఏమీ లేదు..! మొత్తానికి ఇలాంటి చర్చలు, విశ్లేషణలు జోరుగానే సాగుతున్నాయి..!!
P.Venkateswara Rao
614 views
1 months ago
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *అబద్ధం.. అబద్ధం❗‼️* FEBRUARY 25, 2026🎯 ఇటీవల “గ్రేట్ ఆంధ్ర” వెబ్సైట్లో ప్రసిద్ధ వ్యంగ్య రచయిత అద్భుతమైన మాట రాశారు. ఆ మాట ఏంటంటే……… *"అబద్ధాన్ని గౌరవించు. అదే ప్రపంచ విజేత”* ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మాట కొందరు నేతలకు అతికినట్టు సరిపోతుంది. కేవలం అబద్ధాలే తమను మళ్లీమళ్లీ విజేతలుగా నిలుపుతాయనే నమ్మకంతో, నిత్యం అవే ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సహజ న్యాయ సూత్రం ఏంటంటే……… న్యాయం జరగడమే కాదు, జరిగిటనట్టు కనిపించాలి. ఏపీలోని కొంత మంది నాయకుల తీరు ఎలా వుందంటే... తామే చెసిందే న్యాయం, చెప్పిందే చట్టం. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే, ఆ మరుసటి రోజు ఏదో ఒక కేసులో సమీపంలోని జైళ్లలో ఊచలు లెక్కించాల్సి వుంటుంది. ఎవరైనా న్యాయాన్ని, చట్టాన్ని లెక్క చేయరో, వాళ్లే వాటి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. కొంత మంది నాయకుల రాజకీయ పంథాను మొదటి నుంచి గమనిస్తే… కేవలం అబద్ధాల్ని మాత్రమే సాధన చేసిన భావన కలుగుతుంది. అబద్ధాల పునాదులపై రాజకీయ సౌధాల్ని నిర్మించుకున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దాలుగా కేవలం అబద్ధాల్నే చెబుతూ, ప్రజల్ని వంచిస్తూ ఎంత బాగా రాణిస్తున్నారయ్యా అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. ఈ మాటలన్నీ ఎవరి గురించి పేరు చెప్పకుండా, అర్థం చేసుకునే చైతన్యం తెలుగు సమాజం సొంతం. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత……… అరర్రె ఇంతకాలం మనం మోసపోయాం, మోసపోతున్నాం గురూ అనే ఆవేదన కలగకుండా వుండదు. దేశ రాజకీయాల్లోనే ఏపీ రాజకీయాలు ఎంతో ప్రత్యేకం. సీఎం చంద్రబాబు తరచూ కేస్ స్టడీ అంటుంటారు. ఏపీ రాజకీయాలు కూడా కేస్ స్టడీ లాంటివే. రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి ఎన్నైనా అబద్ధాలు చెప్పు. వాటిని నిజమని నమ్మించే మీడియాను చేతిలో పెట్టుకో. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతుంటే, చివరికి అదే నిజమని నమ్మే పరిస్థితిని సృష్టించు. నచ్చి నాయకుడు ఎద్దు ఈనిందంటే కళ్లు మూసుకుని గాటిన కట్టేసే మీడియా ఎలాగూ తోడుంటుంది. బలమైన మీడియా వ్యవస్థని చేతిలో పెట్టుకుని, ప్రజలతో మైండ్రోమ్ ఆడడం ఏపీలో అలవాటైంది. రాజకీయ ప్రత్యర్థులపై తాము మాత్రం ఇష్టానుసారం అబద్ధాల్ని ప్రచారం చేస్తామని, తమ జోలికి వస్తే మాత్రం న్యాయ స్థానాల్ని ఆశ్రయించి, నోళ్లు మూయిస్తామనే ధోరణి ఏపీలో నడుస్తోంది. కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీని అడ్డుపెట్టుకుని ………బాబోయ్ ఎన్నెన్ని విష ప్రచారాలో. వినడానికే జుగుప్స. కానీ విష ప్రచారం చేసేవారిలో మాత్రం అలుపుసొలుపు లేదు. అబద్ధాల్ని నిత్యం ప్రాక్టీస్ చేయడం ఒక కళ అయితే తప్ప, రాజకీయాల్లో అలా చెప్పడం సాధ్యం కాదనిపిస్తుంది. ఇప్పుడ బాధంతా ఏందంటే… ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది? అధికారం, రాజకీయ స్వార్థం కోసం ఎంత వరకైనా దిగజారే వ్యక్తిత్వం ఉన్నోళ్లు, ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం గొప్ప ఆలోచనలు చేస్తారని ఆశించడం అత్యాశే. అధికారం లేకపోతే, ఏమవుతామో అని భయపడే వాళ్లు, దాని కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని బలి తీసుకోవడం పెద్ద విషయం కాదు. ఐదేళ్లకోసారి అధికారం కట్టబెట్టడానికే ప్రజలున్నారని నాయకుల భావన. అబద్ధాలు, దుష్ప్రచారానికి చట్టసభలు అతీతం కాదని నిరూపిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. చట్టసభలు, బయట కొంత మంది అలవోకగా అసత్యాలు చెబుతున్న తీరు చూసి, బహుశా అబద్ధం కూడా సిగ్గుపడుతోంటోంది. తనను అంటరానిదానిగా చూస్తుంటారని, కేవలం దాన్నే నమ్ముకుని రాజకీయ బతుకీడుస్తున్న నాయకులు దర్జాగా అధికారాన్ని అనుభవిస్తున్నారని అబద్ధం వెక్కివెక్కి ఏడుస్తుందేమో! ఏ వినాశకానికి ఈ విపరీత అబద్ధాలో తెలియదు కానీ, పాలకులు మాత్రం ఇలా వుండకూడదని సర్వత్రా కోరుకుంటున్నారు.
P.Venkateswara Rao
539 views
1 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #విజనరీ బాబు 👀 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 ⚡ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ⚡ 🔴 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసుల్లో ఊహించని కీలక మలుపు! 📌 ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. 🔍 కేసు నేపథ్యం – పూర్తి వివరాలు: 👉 2022లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి 50 పేజీల సుదీర్ఘ నివేదికను అధికారులకు సమర్పించారు. 👉 ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ (CID) కేసు నమోదు చేసింది. 👉 ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు A1 ముద్దాయిగా నమోదు అయ్యారు. 👉 అనంతరం, చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. ⚖️ హైకోర్టు షరతులు: 🟡 విచారణను ఎలాంటి విధంగానూ ప్రభావితం చేయరాదు అనే కఠిన నిబంధనతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 🟡 ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 🚨 కొత్త ఆరోపణలు: ❗ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, 👉 ఏపీ సీఐడీ అధికారులను ప్రభావితం చేశారని 👉 అధికార బలంతో విచారణ దిశను మార్చారని 👉 ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని తనకు అనుకూలంగా తిప్పుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఆరోపించారు. ❗ దీనివల్ల హైకోర్టు విధించిన షరతులు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంటూ 👉 మధ్యంతర బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. 🧑‍⚖️ న్యాయపోరాటం: ⚖️ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. 📜 కీలక న్యాయ అంశం: 📌 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, 👉 ఏపీ సీఐడీ ఐజీకి సూపర్వైజింగ్ అధికారి ముఖ్యమంత్రీనే. 👉 అందువల్ల, A1 ముద్దాయి అయిన వ్యక్తే సీఐడీని పర్యవేక్షిస్తే, విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా? అనే తీవ్ర సందేహాలకు ఈ జీవో బలం చేకూరుస్తోంది. ⏳ రేపటి విచారణపై ఉత్కంఠ: 🔥 హైకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, న్యాయపరంగా అత్యంత కీలకం కానుంది. 👉 మధ్యంతర బెయిల్ కొనసాగుతుందా? 👉 లేక రద్దవుతుందా? రేపటి తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది! ⚡
P.Venkateswara Rao
644 views
1 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 రాష్ట్ర శాసన మండలిలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయిపోయిందని స్పష్టమవు తోంది. అసలు సమస్యలను పక్కదారి పట్టించి, భావోద్వేగాలతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు ఎన్నికల ముందు ఊరించిన 'సూపర్ సిక్స్' హామీల ఊసే లేదు. నిరుద్యోగ భృతి ఏమైందో ఎవరికీ తెలియదు, అమ్మఒడికి దిక్కు లేదు, నిత్యావసర ధరలు చూస్తే సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ వైఫల్యాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పలేక నీళ్లు నములుతుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నేరుగా పాయింట్ మీద కొడుతున్నారు. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి, మరియు హెరిటేజ్ పాల సరఫరాపై బహిరంగ చర్చ జరగాలని డిమాండ్ చేస్తుంటే కూటమి నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి వాడారంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆ చర్చకు సిద్ధపడలేకపోవడం వారి బలహీనతను బయటపెడుతోంది. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? అందులో హెరిటేజ్ సంస్థ పాత్ర ఎంత? అసలు పాల సేకరణలో జరిగిన లోపాలు ఏమిటి? అనే ప్రశ్నలకు వైసీపీ నాయకులు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక దేవుడి ఫోటోల చుట్టూ వివాదాలు అల్లుతున్నారు. ఆధునిక దేవాలయం లాంటి మండలిలో వేంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తేనే తట్టుకోలేక విలవిలలాడిపోవడం చూస్తుంటే, వీరికి భక్తి కంటే తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువగా కనిపిస్తోంది. దేవుడి ఫోటోను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థిని ఇరికించాలనుకుని తామే ఇరకాటంలో పడుతున్నారు. ఇక్కడ అసలైన కామెడీ ఏమిటంటే, నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర. గతంలో ఆయన సాక్షాత్తూ స్వామివారి ఫోటోను పట్టుకుని, కాళ్లకు బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆనాడు లేని ధర్మం, ఆనాడు గుర్తుకురాని సంప్రదాయాలు ఇప్పుడు మాత్రం అడ్డగోలుగా గుర్తొచ్చేస్తున్నాయి. తన సొంత తప్పులను పక్కన పెట్టి, ఎదుటివారి మీద బురద చల్లాలని చూసి ఇప్పుడు తానే ఆ బురదలో కూరుకుపోయి 'సెల్ఫ్ గోల్' వేసుకుంటున్నారు. బూట్లు వేసుకుని దేవుడిని పూజించిన వారు, ఇప్పుడు ఫోటో కనిపిస్తేనే అపవిత్రం అయిపోయిందని గగ్గోలు పెట్టడం చూస్తుంటే వీరు ఏ స్థాయిలో వత్తిడికి లోనవుతున్నారో అర్థమవుతోంది. వైసీపీ నాయకులు లడ్డూ వివాదంపై శాస్త్రీయమైన చర్చ కోరుతుంటే, కూటమి నేతలు మాత్రం పాత రికార్డులా విమర్శలు చేస్తున్నారు. హెరిటేజ్ పాల నాణ్యత మీద, నెయ్యి కాంట్రాక్టుల మీద స్పష్టత ఇవ్వాల్సింది పోయి, భక్తిని రాజకీయం చేయడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం. ఒకవైపు ప్రజల కష్టాలు కొండంత ఉంటే, ప్రభుత్వం మాత్రం ఆ కష్టాలను తీర్చడం వదిలేసి, ఇలాంటి డ్రామాలకు తెరలేపుతోంది. ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక, సభలో గందరగోళం సృష్టించడం వల్ల కూటమి ప్రభుత్వం బాగా 'నలిగిపోయినట్లు' సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం కంటే కూడా 'ఎవరు ఎక్కువ అరిస్తే చంద్రబాబు దగ్గర మార్కులు పడతాయి' అనే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే లాజిక్ లేని విమర్శలు చేస్తూ నవ్వులపాలవుతున్నారు. సభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావాలి కానీ, ఫోటోలు, వీడియోల మీద పడి ఏడవడం వల్ల ఆ వ్యవస్థ గౌరవం తగ్గుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుడిని, నెయ్యిని అడ్డం పెట్టుకోవడం అత్యంత దారుణమైన విషయం. భక్తిని రాజకీయం చేస్తే కాలమే సమాధానం చెబుతుందని వీరు మర్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గందరగోళ వ్యూహాలు చూస్తుంటే, వారు తీవ్రమైన వత్తిడిలో ఉండి ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదనిపిస్తోంది. అద్దాల మేడలో ఉండి ఎదుటివారి మీద రాళ్లు వేయకూడదు. చంద్రబాబు గారు తన గత ప్రవర్తనను ఒక్కసారి నెమరువేసుకుంటే, ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో ఆయనకే అర్థమవుతుంది. లడ్డూ, నెయ్యి, హెరిటేజ్ పాలపై చర్చకు రాకుండా తప్పించుకుంటూ, కేవలం వైసీపీని బద్నాం చేయాలని చూస్తే అవి రివర్స్ అయ్యి కూటమి పునాదులనే కదిలిస్తాయి. ప్రజలకు కావలసింది డ్రామాలు కాదు, అభివృద్ధి మరియు ఇచ్చిన హామీల అమలు. ఆ దిశగా అడుగులు వేయకుండా ఇలాంటి 'చిల్లర' రాజకీయాలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం రోజురోజుకూ తన విశ్వసనీయతను కోల్పోతోంది.
P.Venkateswara Rao
494 views
2 months ago
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *బాబు సర్కార్ను బజార్న పడేసిన కొలికపూడి❗* FEBRUARY 9, 2026🎯 కూటమి సర్కార్కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారారు. పదేపదే సొంత ప్రభుత్వాన్ని బజారులో పడేస్తున్నారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకూల మీడియాలో లీకు వార్తలు రావడం తప్ప, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పలుమార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు వెళ్లినా, ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తేలిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయిలు డబ్బు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యవహారంలో కేశినేని చిన్ని, కొలికపూడిపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తుత్తిదే అని కాలం నిరూపించింది. తాజాగా సీఎం చంద్రబాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సవాల్ విసిరేలా, వాట్సప్ స్టేటస్ పెట్టడం తీవ్ర చర్చనీయైశమైంది. *“మూడు రోజులు 35 గ్రామాలు. 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పల్లెలు. పల్లె కన్నీరు పెడుతోంది”* అని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే తమ పాలనలో ఏపీ రూపు రేఖలు మారిపోయాయని చెబుతున్నారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్తో తేల్చి చెప్పి, ప్రభుత్వ పరువును వీధిన పడేశారు. రోడ్లు లేవు, అలాగే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా పల్లె కన్నీరు పెడుతోందని నేరుగానే ఆయన సొంత ప్రభుత్వానికి చురకలు అంటించేలా పోస్టు పెట్టడం గమనార్హం. ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పలేదు. మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో తిరిగి, 480 కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడి, మరీ చెబుతున్నట్టు ఆయన గణాంకాలతో సహా వాట్సప్ స్టేటస్లో పొందుపరిచడం గమనార్హం.