chittibabu

P.Venkateswara Rao
484 views
17 hours ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఏపీ అప్డేట్స్ 🎯 * #చంద్రబాబు ఇంతగా దిగజారడానికి కారణమేమిటి❓* మోడీ పాదాలకు మోకరిల్లిన ఆంధ్రుల పరువు భజన చేసే విధములో పతనం చివరి అంచుకు చేరిన ముఖ్యమంత్రి పొగడ్తలు ఇది ఎంత మాత్రం భక్తి కాదు, భయమైతే దేనివల్ల? మా నాయకుడిని ఇట్లా కూడా కీర్తించవచ్చని మాకే తెలియలేదంటున్న బిజెపి నేతలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఈ గతి పట్టడం విచారకరం భోగాపురం విమానాశ్రయ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం సర్వత్రా విమర్శల పాలవుతున్నది. చంద్రబాబు నాయుడు సాధారణ రాజకీయ వాది కాదు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నేత. మహామహుల చేత విజనరీ అని ప్రశంసలు పొందిన, రాజకీయాలను సాంప్రదాయ పోకడల నుంచి అభివృద్ధి దిశకు మలుపు తిప్పిన అఖండ మేధావి. పదిహేనేళ్లకుపైగా ముఖ్యమంత్రి. జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర కీలమైనది. కానీ ఈ సభలో మాత్రం ఆయన ప్రవర్తన, మాటలు, విన్యాసాలు ఒక చవకబారు కార్యకర్త వలే కనిపించాయి. ఆ మాటలు విన్న, విన్యాసాలు చూసిన వారంతా, తెలుగుదేశం నేతలతో సహా ఎంతో బాధపడ్డారు. మన నాయకుడికి ఈ దుర్గతి ఏమిటని వాపోయారు. మోడీని ఆకాశానికి ఎత్తడంలో అవధులు మీరాడు చంద్రబాబు. మోడీ... మోడీ... మోడీ... అంటూ కేకలు పెట్టి, చేతులు తిప్పి విన్యాసాలు చేశాడాయన. చూసే వారికి వికారంగా కనిపించాయవి. ఇక్కడ నుంచి మోడీ గారు కర్నాటక వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి డికె.శివకుమార్, రాజకీయంగా చాలా చిన్నస్థాయి కలిగిన వాడు. కానీ వేదిక మీద ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా కనిపించింది. దేశ ప్రధానికి ఎంత మేర గౌరవం ఇవ్వాలో అంతా ఇస్తూ కూడా తన ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవినే కాదు, తన వ్యక్తిత్వాన్ని, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గౌరవాన్ని పణంగా పెట్టేశాడు. తెలుగుదేశం పార్టీ ఏ కారణంతో పుట్టిందీ అందరికీ తెలుసు. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ అది. ఆ రోజులలో రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లే కాంగ్రెస్ నాయకులు అధిష్టానం పెద్దల మెప్పు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నే దెబ్బ తీస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాటల్లోని నిజం గ్రహించిన ఆంధ్ర ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, అదే ఢిల్లీ పెద్దల మోకాళ్ల ముందు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోకరిల్లేట్లు చేస్తున్నది. పరువు తీస్తున్నది. సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి తెచ్చి పెడుతున్నది. ఎందుకీ దిగజారుడు? మోడీ పట్ల భక్తితోనో లేదా ఆయన దేశం కోసం ఎవరూ చేయనంత గొప్పగా పని చేస్తున్నాడనో ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని చంద్రబాబుకు కూడా తెలుసు. మోడీ విషయంలో, ఏడేళ్ల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు వాడిన పదజాలం అందరికీ గుర్తే. మోడీ ఒక ఉగ్రవాది అన్నాడు. ఇంకా వ్యక్తిగతంగా వెళ్లి భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏమి చూసుకుంటాడని నిందించాడు. మోడీ కూడా తక్కువ తినలేదు. చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడని ధ్వనించేట్లు, పోలవరాన్ని ఎటిఎం వలే వాడుకుంటున్నాడని విమర్శించాడు. తన కంటే సీనియర్ అని చంద్రబాబు పదే పదే చెప్తూ వుంటాడని, కానీ ఒక ఎన్నికలో గెలిచి, ఆ వెంటనే మరొక ఎన్నికలో ఓడిపోయే సీనియారిటీ; సొంత మామనే కాక ఆంధ్ర ప్రజల స్వప్నాలను కూడా వెన్నుపోటు పొడిచే సీనియారిటీ తనకు లేదని ఎగతాళి చేశాడు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవ భావాలు లేవని చెప్పడానికి ఇవొక ఉదాహరణలు. భక్తి లేనప్పుడు, భయం వుండాలి. ఆ భయం దేనికోసం అన్నది ప్రశ్న. ఇడి, సిబిఐ వంటి కేంద్ర సంస్థలతో ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం; కాళ్లబేరానికి వస్తే ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా పదవితో సత్కరించడం మోడీ నైజం. చంద్రబాబుకు ఒకరు పదవి ఇవ్వవలసిన అవసరం లేదు. ఆయన సొంత కష్టంతో నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కావాలనే కోరిక ఉంటే పాతికేళ్ల క్రితమే ప్రధానిగా కూడా వ్యవహరించే వాడు. ఇక మిగిలింది - ఇడి దాడుల భయం. తప్పుడు దారులలో అక్రమ సంపాదన చేసే వారిని మాత్రమే ఇడి భయపెట్టగలదు. అంటే, చంద్రబాబు వద్ద కూడా అటువంటి అక్రమాలు వున్నాయని భావించాలా? ఏది ఏమైనా, తన స్వార్థం కోసం యావత్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని బజారులో తాకట్టు పెట్టడం చంద్రబాబు చేయదగిన పని కాదు. ఈ తప్పును ఆయన ఎట్లా సవరించుకుంటాడో తెలియదు; జీవితకాలంలో తప్పు దిద్దుకొనే అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు.
P.Venkateswara Rao
656 views
15 days ago
#పొలిటికల్ ట్రోల్స్ 🤣 #చంద్రబాబు *చంద్రబాబును శాటిస్‌ఫై చేయడం ఈజీ కాదు గురూ❗* 24.07.2026🎯 మీరు వంద రకాలుగా కష్టపడండి.. వంద రకాలు పనులు చేయండి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నూటొకటో కష్టం గురించి అడుగుతారు.. అది చేయలేదు ఏం? అంటూ పెదవివిరుస్తారు.. అనేదే ప్రస్తుతం ఏపీలోని తెలుగు తమ్ముళ్ల ఆవేదనగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ మైలేజీ కోసం ఆశ్రయించే పద్ధతుల్లో ఆత్మస్తుతి- పరనింద రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆత్మస్తుతి- అంటే బీభత్సంగా సొంత డబ్బా కొట్టుకోవడం. రెండు పరనింద- అంటే నిత్యం ప్రత్యర్థులను తిట్టిపోస్తూ ఉండడం. ఎక్కువ మంది నాయకులు సొంత డబ్బాకే పరిమితం అవుతుంటారు. కానీ.. రాజకీయాల్లో నెగ్గాలంటే.. సొంతడబ్బా కొట్టుకుంటూనే అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థిని తిట్టిపోయడం ముఖ్యం అనే సూత్రాన్ని నమ్మే వ్యక్తి చంద్రబాబునాయుడు. అందుకే ఆయన రోజులో కనీసం పదిసార్లయిన జగన్మోహన్ రెడ్డి పారాయణం చేస్తుంటారు. గొడ్డలిపార్టీ నామజపం చేస్తుంటారు. ఆ రేంజిలో- ప్రజలకు చీదర పుట్టించేలాగా.. పాడిందే పాడుతూ పాచి విమర్శలు చేయడం అందరు మంత్రులకూ చేతకావడం లేదు. బాబు గారి బాటలో మంత్రులందరూ కూడా జగన్ ను, వైసీపీని తిట్టడంలో తమ వంతగా చెలరేగుతూనే ఉన్నారు గానీ.. ఒకే నింద కొన్ని వందలసార్లు రిపీట్ చేయడానికి చాలా మందికి సిగ్గుగా ఉంది. అందుకే చంద్రబాబు గారికి ఇప్పుడు కోపం కూడా వస్తోంది. కేబినెట్ మీటింగులో లాంఛనప్రాయమైన ఎజెండా అంశాల తర్వాత.. చంద్రబాబునాయుడు తన ఫోకస్ మొత్తం మంత్రుల్ని మందలించడానికి, ప్రేరణ పేరుతో వారిని వైసీపీ, జగన్ మీదకు ఉసిగొల్పడానికి కేటాయించారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధపు ఆరోపణలు చేస్తోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. మీరు ఏదో ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించి వదిలేస్తున్నారు. అలా ఊరుకుంటే సరిపోదు. వారు మళ్లీ మళ్లీ నిందలు వేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు.. మీరు మళ్లీ మళ్లీ వారిని తిడుతూ ఉండాల్సిందే అని చంద్రబాబునాయుడు మంత్రులకు హితోపదేశం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో పార్టీనే నిర్ణయిస్తుంటుంది.. స్క్రిప్టులు కూడా పంపిస్తుంటుంది.. అనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. వీటిని మించి తమ తమ రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా.. మీడియా ఎదుట మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మంత్రులు చెలరేగిపోతూనే ఉన్నారు. వైఎస్ జగన్ ను కార్నర్ చేసి.. ఆ పార్టీమీద విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ.. ఆ డోసేజీ చంద్రబాబుకు చాలడం లేదు. చూడబోతే.. మంత్రులందరూ తమ అధికారిక కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి.. రోజుకు పద్దెనిమిది గంటల పాటు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ను తిడుతూ గడపాలేమో అని.. అలా చేస్తే తప్ప.. చంద్రబాబు సంతృప్తి చెందరిన పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఏ విషయంలో అయినా చంద్రబాబునాయుడును శాటిస్ ఫై చేయవచ్చునేమో గానీ.. జగన్ ను తిట్టే విషయంలో ఎంతగా కష్టపడినా సరే.. ఆయనను శాటిస్ ఫై చేయలేం అని ఆ పార్టీ వారే నవ్వుకుంటున్నారు.
P.Venkateswara Rao
607 views
19 days ago
#చంద్రబాబు #ఎల్లో మీడియా.. 💥 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *జగన్ను వద్దంటున్నాడంటే.. వస్తున్నాడనేనా❓* JULY 19, 2026🎯 వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మళ్లీ అధికారం వద్దే వద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదేపదే అంటున్నారు. కార్యక్రమం ఏదైనా చంద్రబాబు తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బాబాయి, గొడ్డలి, తల్లీచెల్లి ఇవే ప్రాధాన్య అంశాలు. మిగిలివన్నీ చంద్రబాబుకు అప్రాధాన్యమయ్యాయి. ఇలాంటి తీవ్ర ఆరోపణలతోనే జగన్పై ప్రజల్లో వ్యతిరేకత స్థిరంగా ఉండనివ్వడం, అలాగే పెంచొచ్చనేది బహుశా చంద్రబాబు వ్యూహం కావచ్చు. రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాలే భవిష్యత్ను తేలుస్తాయి. జగన్పై చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల తీవ్ర విమర్శల్ని పరిశీలిస్తే, వాటినే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇంతకంటే వేరే మార్గం కూడా టీడీపీకి లేనట్టుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా వుంటాయో ప్రజలు ఊహించుకోవాలన్నారు. ఆ పార్టీకి అధికారం వద్దేవద్దని చంద్రబాబు అన్నారు. ఆ మాటలే టీడీపీ అనుకూల మీడియాకు బ్యానర్ కథనమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పడిపోయింది. అలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబుకు ఎందుకు అనుమానం వచ్చిందో అర్థంకాని ప్రశ్న. మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పార్టీ అధినేతగా తన పార్టీ శ్రేణుల్ని ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడానికి అలా మాట్లాడకతప్పదు. కానీ వైసీపీ వద్దే వద్దని చంద్రబాబు పదేపదే అంటున్నారని సీరియస్ గా ఆలోచించాల్సిన సంగతే. ఎందుకంటే, వైసీపీ మళ్లీ వచ్చే సంకేతాలేవో చంద్రబాబుకు అందుతున్నట్టుంది. అందుకే ఆయన మాటల్లో భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. వైసీపీ రాజకీయంగా ఒంటరి. అలాంటప్పుడు మూడు పార్టీలను కాదని, వైసీపీ రాజకీయంగా దూసుకొస్తుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైసీపీకి మళ్లీ అధికారం అంటే, అది తమ ఫెయిల్యూర్ చంద్రబాబు ఎందుకు చూడడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వొద్దని కాదని చంద్రబాబు కోరాల్సింది. తమనే కొనసాగించాలని చంద్రబాబు కోరితే, అది కూటమిలో జోష్ నింపుతుంది. అందుకు విరుద్ధంగా మళ్లీ వైసీపీకి అధికారం కట్టబెట్టొద్దని కోరడం… ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో వణుకు పుట్టిస్తోంది. వైసీపీని పదేపదే వద్దని చంద్రబాబు అంటే, మళ్లీ వస్తున్నాడా? అని టీడీపీ శ్రేణులే అనుమానించే పరిస్థితి. భయంతో బాబు అంటున్న మాటలు, రాజకీయంగా టీడీపీకి భారీ డ్యామేజీ కలిగిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకాదు, చంద్రబాబు తన పాలనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా వుంది. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం వుంటే, అసలు వైసీపీని పట్టించుకోవాల్సిన పనేలేదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీపై పదేపదే విమర్శలు చేస్తున్నారంటే, ఆ పార్టీ ఎంతగా భయపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రత్యర్థి గురించి 24 గంటలూ పట్టించుకుంటున్నాడంటేనే, అది ఎంతగా కలవరపెడుతున్నదో అని ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి. వైసీపీ ఉనికికే గుర్తించడానికి చంద్రబాబు నిరాకరించి వుంటే, అప్పుడు కూటమి పాలన శభాష్ అనే రీతిలో సాగుతోందనే సంకేతాలు వెళ్లేవి. కానీ చంద్రబాబు పదేపదే వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే, ఏదో తేడా కొడుతున్నట్టుందని చర్చించుకునే పరిస్థితి. తనకు తానే కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనుమానాల్ని చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారు. ఒక మనిషిని రానివ్వొద్దని ఎవరైనా అంటున్నారంటే, అతను వస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏపీలో వైసీపీని కూడా చంద్రబాబు ఆ కోణంలోనే చూస్తున్నారు. చంద్రబాబును వైసీపీ దూకుడు భయపెడుతోంది. అలాగని పరిపాలనలోని లోపాల్ని సరిదిద్దుకోవాలని ఆయన ఏ మాత్రం అనుకోవడం లేదు. కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, దోపిడీని అరికట్టాలని కనీస శ్రద్ధ కూడా కనబరచడం లేదు. అయినా వైసీపీకి అధికారం ఇవ్వొద్దనేది చంద్రబాబు డిమాండ్. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం వుంది. ఇంత ముందుగానే ఎన్నికల ప్రచారంలో అప్పీల్ చేసినట్టుగా చంద్రబాబు మాటలున్నాయి. చంద్రబాబు ముందు చూపున్న నాయకుడంటే జనం ఏమో అనుకున్నారు. ఆయన ఆలోచనలన్నీ అధికారం చుట్టూ తిరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి అధికారం దక్కకుండా చేయాలంటే, మంచి పరిపాలన అందించడం ఒక్కటే ఏకైక మార్గమని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? అయినప్పటికీ వైసీపీకి అధికారం ఇస్తారేమో అని ప్రజల్ని హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
P.Venkateswara Rao
641 views
1 months ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబు తెలివితేట‌లు ఏమ‌య్యాయో❗* 04.07.2026🎯 సీఎం చంద్ర‌బాబుకి అప‌ర చాణ‌క్యుడ‌నే పేరు వుంది. కొన్నేళ్ల పాటు తెలుగు స‌మాజాన్ని టీడీపీ అనుకూల మీడియానే రాజ్య‌మేలేది. ఎప్పుడైతే సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిందో, అప్ప‌టి నుంచి నాణేనికి రెండో వైపు కూడా చూప‌డం మొద‌లైంది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చీల్చి చెండాడం స్టార్ట్ అయ్యింది. అయితే బ‌ల‌మైన మీడియా కార‌ణంగా చంద్ర‌బాబు అంటే గొప్ప విజ‌న‌రీ, రాజ‌కీయంగా అప‌ర చాణ‌క్యుడ‌నే కీర్తి స్థిర‌ప‌డింది. కానీ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేక‌పోవ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాజ‌కీయ ఆట‌లు సాగాయ‌నే అభిప్రాయం లేక‌పోలేదు. ఏది ఏమైనా నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేని ఘ‌న‌త‌ను బాబు ద‌క్కించుకున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను త‌ప్ప‌క అభినందించాలి. రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం చంద్ర‌బాబును మ‌రింత ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా తీర్చిదిద్ది వుండాల్సింది. అదేంటో గానీ, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక‌, గ‌తంలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా పాల‌న సాగిస్తున్నార‌నే విమ‌ర్శ‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. బాబు 4.0లో ఆయ‌న మార్క్ ప‌రిపాల‌న అస‌లు క‌నిపించ‌డం లేద‌ని చివ‌రికి సొంత పార్టీ నాయ‌కులు, ఆయ‌న్ను అభిమానించే త‌ట‌స్థులు వాపోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల చోటు చేసుకున్న మూడు ఘ‌ట‌న‌ల్ని తీసుకుందాం. వైసీపీకి ఏ మాత్రం సంబంధం లేని అంశాలు కూట‌మి ప్ర‌భుత్వాన్ని చిరాకు తెప్పిస్తున్నాయి. కూట‌మిని బ‌ద్నాం చేస్తున్నాయి. అంతిమంగా రాజ‌కీయంగా వైసీపీకి ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నాయి. ద‌ళిత క్రైస్త‌వుల వివాదం, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కామెంట్స్‌, తాజాగా ఒకేరోజు హైద‌రాబాద్‌లో యూట్యూబ‌ర్ రావ‌ణ్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అంశాలు తెలుగు రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌ల‌య్యాయి. డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అతి జోక్యంతో ద‌ళిత క్రిస్టియ‌న్ల వ్య‌వ‌హారం రావ‌ణ‌కాష్టంలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌గులుతోంది. ద‌ళితులే ఓట్లే అవ‌స‌రం లేద‌నే వ‌ర‌కూ ర‌ఘురామ వెళ్లారు. ఈ మాట‌లు మాల‌, మాదిగ‌, గిరిజన‌, మైనార్టీల్లో బాగా నాటుకుపోయాయి. వాళ్లంద‌ర్నీ బాగా హ‌ర్ట్ చేశాయి. ర‌ఘురామ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న టీడీపీకి వ్య‌తిరేకంగా రానున్న ఎన్నిక‌ల్లో వాళ్లంతా ప‌ని చేయ‌నున్నారు. వైసీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండానే జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్‌, విజ‌య్‌కుమార్‌, పీవీ సునీల్‌కుమార్ , హ‌ర్ష‌కుమార్ త‌దిత‌రులంతా ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా స‌భ‌లు, స‌మావేశాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. కూట‌మిని వారంతా విల‌న్‌గా చూస్తున్నారు. అంతిమంగా రాజ‌కీయంగా వైసీపీకి ఉప‌యోగ‌ప‌డ‌నున్నారు. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ త‌న‌కు తెలిసిన విశ్వ‌స‌నీయ స‌మాచారం గురించి విశ్లేషిస్తే, ఆయ‌న‌పై ఏపీలో కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తామంటే, తానే వ‌ద్ద‌న్నాన‌ని స్వ‌యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కేంద్రంగా పెద్ద ర‌చ్చే జరిగింది. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో స‌మాజంలో కొంత గౌర‌వం వుంది. అలాంటి వ్య‌క్తిపై కూడా కేసులు పెట్టారంటే, పాల‌న ఏ రీతిలో సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయానికి కూట‌మి ప్ర‌భుత్వం చేజేతులా చోటు ఇచ్చింది. మూడో అంశం… యూట్యూబ‌ర్ రావ‌ణ్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్ అరెస్ట్‌లు ఒకే రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ప‌రుష ప‌ద‌జాలాలే త‌మ భాష‌గా, బ‌లంగా భావిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రావ‌ణ్ అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశార‌ని కేసులు పెట్టి, రాష్ట్ర‌మంతా తిప్పుతున్నారు. జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్‌పై అక్ర‌మ కేసు పెట్టారంటూ తెలంగాణ జ‌ర్న‌లిస్టులు తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు. ప్ర‌స్తుతం కేవీఆర్ రిమాండ్‌లో ఉన్నారు. రావ‌ణ్ విష‌యానికి వ‌స్తే …వ‌రుస‌గా మూడు కోర్టుల్లోనే బెయిల్ ల‌భించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు న‌మోదు చేసి, వేధిస్తున్న తీరు ఆయ‌న‌పై సానుభూతి పెంచుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ ఆస‌క్తి వున్న‌వాళ్ల‌కు త‌ప్ప‌, ఇత‌రుల‌కు ఎవ‌రో తెలియ‌ని రావ‌ణ్‌, ఇప్పుడు హీరో అయ్యాడు. అత‌న్ని హీరో చేసిన ఘ‌న‌త జ‌న‌సేన‌కే ద‌క్కుతుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కూట‌మికి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చిన అంశాలున్నాయి. కాకినాడ‌లో పోలీస్ వాహ‌నంలో వెళ్తున్న రావ‌ణ్‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డ‌మే అన్యాయం అనుకుంటే, మ‌చిలీప‌ట్నంలో ఏకంగా పోలీస్‌స్టేష‌న్‌పైకే వెళ్ల‌డం అరాచ‌కానికి ప‌రాకాష్టగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఎవ‌రైనా చిన్న విమ‌ర్శ చేసినా స‌రే ఇళ్ల‌పైకి, అవ‌స‌ర‌మైతే పోలీస్‌స్టేష‌న్ల‌పైకి కూడా దండ‌యాత్ర చేస్తామ‌ని జ‌న‌సేన సంకేతాలు పంపింది. ఈ ప‌రిణామాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాట‌ల్లో చెప్పాలంటే, విప‌రీత ధోర‌ణుల్ని స‌మాజం చూస్తోంది. అధికారం ఇస్తే, మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. వీటిని పౌర స‌మాజం అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. ఇవ‌న్నీ కూడా రాజ‌కీయంగా కూట‌మికి తీవ్ర న‌ష్టం క‌లిగించేవే. జ‌న‌సేన‌కు పెద్ద‌గా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ 21 సీట్ల‌లోనే పోటీ చేసింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి అంత‌కు మించి ఇచ్చే ప‌రిస్థితి కూడా వుండ‌ద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. కానీ అత్య‌ధిక స్థానాల్లో పోటీ చేసే టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ఏం జ‌రుగుతుందో తెలియ‌నంత అమాకుడు కాదు చంద్ర‌బాబు. కానీ ఎందుక‌నో ఆయ‌న మౌన‌ముద్ర‌లో ఉన్నారు. ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల్ని క‌ట్ట‌డి చేయ‌డంలో బాబు స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌కు చోటు క‌ల్పించారు. అప‌ర చాణ‌క్యుడు ఏమ‌య్యాడు? ఎక్క‌డికి పోయాడ‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. ఎందుకంటే, రాజ‌కీయంగా వైసీపీని ఎదుర్కోవ‌డ‌మే టీడీపీకి స‌వాల్‌గా మారింది. అందుకే జ‌న‌సేన‌, బీజేపీని క‌లుపుకుని ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసింది. ఒంట‌రిగా పోటీ ఆలోచ‌నే టీడీపీని భ‌య‌పెడుతుంది. అలాంటిది వైసీపీతో సంబంధం లేకుండానే, సాధార‌ణ వ్య‌క్తుల‌తో గొడ‌వ‌లు పెట్టుకుంటే, వాటిని పెద్ద‌వి చేసుకుంటూ రాజ‌కీయంగా న‌ష్టం చేసుకుంటున్నారు. అందుకే బాలు తెలివితేట‌లు ఏమయ్యాయో అని సొంత‌వాళ్లు కూడా ఆవేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయంగా వైసీపీ ఎటూ దూకుడుపై వుంది. ఇదే సంద‌ర్భంలో బ‌ల‌మైన పౌర స‌మాజం కూడా కూట‌మికి శ‌త్రువుగా త‌యార‌వుతోంది. కూట‌మి ఓట‌మిని కాంక్షిస్తోంది. ఈ ప్ర‌మాదాన్ని గుర్తించ‌క‌పోగా, ఆజ్యం పోస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ తీరు వుంది. బాబు ప్ర‌మేయం లేకుండానే, కూట‌మిలోని ముఖ్య నేత‌లు ఎవ‌రికి వారు నియంత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ, రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం తీసుకొస్తున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దీన్ని అదుపు చేసే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. అస‌లు బాబు ఏం చేస్తున్నారో అనే ప్ర‌శ్న‌, ఆయ‌న్ను అభిమానించే వారి నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.
Kalam Daily
812 views
1 months ago
రాయలసీమకు పారిశ్రామిక కళ ! JSW Rayalaseema Steel Plant to Create 2,500 Jobs in Kadapa #JSW #JSWSteel #Rayalaseema #Kadapa #Jammalamadugu #Chandrababu #Kalam #KalamDaily #KalamPaper #TDP ✌️ Chandrababu Naidu #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #chandrababu naidu
Kalam Daily
1K views
1 months ago
ఇకపై ప్రభుత్వ సేవలు మరింత సులువు! Mana Mitra WhatsApp Platform to Simplify Access to Government Services #APGovt #ManaMitra #eGovernance #GovtServices #Kalam #KalamDaily #KalamPaper #chandrababu naidu #nara chandra babu naidu #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #TDP ✌️ Chandrababu Naidu
P.Venkateswara Rao
774 views
4 months ago
#చంద్రబాబు *పక్షపాతం- పక్షవాతం…! తటస్థ మీడియా ఎక్కడుంది చంద్రబాబూ…❓* March 30, 2026🎯 ఐజేయూ సభలో అనుకుంటా… చంద్రబాబు ఓ మాటన్నాడు… రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం సమాజానికి చేటు అట…! ఎందుకట..? ఏ పార్టీ వాడు వాడి వాయిస్ వినిపించుకుంటాడు… తప్పేముంది..? అసలు పక్షపాతం, పక్షవాతం లేని మీడియా ఏముంది ఇప్పుడు దేశంలో..?! ఆయన బాధ అది కాదు… ఇంతకుముందు తన సామాజికవర్గం, తన పార్టీ, తనకు కొమ్ముకాసే, వత్తాసు పలికే, క్యాంపెయిన్ చేసే మీడియా మాత్రమే ప్రబలంగా ఉండేది… తన ఎజెండా ప్రకారం అవి కథనాలు వడ్డించేవి… ఆ వాయిసే జాతి వాయిస్‌గా చెలామణీ అయ్యేది… ఇప్పుడు ఆల్టర్‌నేట్ వాయిస్ కూడా వినిపిస్తోంది… కౌంటర్లు పడుతున్నాయి, అదీ తన బాధ… ఏదో ఓ పార్టీకి కొమ్ము కాయడం ఏనాటి నుంచో ఉంది, తెలుగు మీడియాలో కూడా..! కారణాలు, ప్రభావాలు ఏమైనా గానీ, న్యూట్రల్ స్టాండ్ గాకుండా వన్ సైడ్ పొలిటికల్ లైన్ తీసుకోవడం కొత్తేమీ కాదు… కాకపోతే ఇప్పుడు మీడియా అంటే అక్రమ సంపాదనల్ని దారిమళ్లించడానికి ఓ చాయిస్… అక్రమ సంపాదనలకు ఓ రక్షణ… అక్రమాలకు ఓ షీల్డ్… అందుకే పార్టీల అధినేతలే స్వయంగా మీడియా హౌజులు పెట్టేసుకుంటున్నారు… తమిళనాడు స్టాలిన్ దగ్గర నుంచి అస్సాం హిమంత విశ్వ శర్మ దాకా బోలెడు మంది నాయకులకు సొంత మీడియా హౌజులున్నాయి… పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు… అంతెందుకు… చిన్నాచితకా లీడర్లకు కూడా ఈరోజు సొంత సోషల్ మీడయా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నారు… ప్రజెంట్ కాలం సోషల్ మీడియాది కాబట్టి… ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ అనబడే సోకాల్డ్ పక్షపాత పత్రికలను, ఆ రిపోర్టర్లను కవరేజ్ కోసం బతిమిలాడాల్సి వచ్చేది… ఇప్పుడదేమీ లేదు… ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్ వేదికలే శరణ్యం… కాకెపోతే చంద్రబాబు అభిమాన పత్రికలు, టీవీలు ముసుగు కప్పుకుని, కాస్త తలుపుచాటు నుంచి సైగ చేసే బాపతు… సాక్షి, నమస్తే తెలంగాణ వంటివి బజారులోనే నిలబడి కన్నుకొట్టే బాపతు… అదొక్కటే తేడా… నాణ్యమైన జర్నలిజం, నాసిరకం జర్నలిజం నడుమ పెద్ద తేడా కూడా ఏమీ లేదిప్పుడు… నిజమే… రేవంత్ రెడ్డి చెప్పినట్టే చంద్రబాబు కూడా చెబుతున్నాడు… సోషల్ మీడియా ఓ ముప్పుగా మారిందని..! అవును, డర్టీ క్యాంపెయిన్స్, ఫేక్ వార్తలు, ప్రాపగాండా వీడియోలు, అబద్ధాలు, మార్ఫ్‌డ్ ఫోటోలు, ఎఐ వీడియాలతో వేల టన్నుల ప్రచార బురదను జనం బుర్రలపైకి వెదజల్లుతున్నాయి పార్టీల సోషల్ టీమ్స్… వందల కోట్ల ఖర్చు… చివరకు ఇళ్లు దాటని నాయకుల కుటుంబాలను కూడా బజారుకు లాగుతూ డర్టీ క్యాంపెయిన్ సాగుతోంది… ఒకటీ అరా కేసులు పెడుతున్నా నిలవడం లేదు… భావప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా దుర్వినియోగం అవుతోంది… దీన్ని అడ్డుకోవడానికి ‘స్వీయ నియంత్రణ’ పాటించండి అని ధర్మబోధ చేస్తే, పిలుపునిస్తే అదేమీ పనిచేయదు… ఉద్దేశపూర్వకంగా సాగే ‘మడ్ స్లింగ్’ ఫేక్ జర్నలిజం ఆగదు… ఏదో ఒక చట్టం చేసి కట్టడి చేయడమే ఓ మార్గం… అదెలాగో ప్రభుత్వాలకే అర్థం కావడం లేదు…!!