ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏

PSV APPARAO
862 views
2 months ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #జయ ఏకాదశి / భీష్మ ఏకాదశి విశిష్టత *ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి* భీష్మ ఏకాదశినాడు చేయవలసిన విధివిధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మారాధనతో మన లక్ష్యమైన ఉత్తమలోక ప్రాప్తి సాధించడంలో విజయులవుతారని అంటారు. నేడు భీష్మ ఏకాదశి. భీష్ముడు విష్ణువులో ఐక్యమైన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అయినందున ఈ ఏకాదశికి ముందు ఆయనకు గుర్తుగా భీష్మ అనే పేరు చేర్చారు. అంతేకాక ఆయన విష్ణు భక్తుడు. ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అందువల్ల విష్ణు ప్రీతికరమైన ఆ రోజుకు ఆయన ప్రియ భక్తుడైన భీష్ముని పేరు పెట్టారు. నిజానికి ఈ ఏకాదశి పేరు జయ ఏకాదశి. దీనిని విష్ణు తిథి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈరోజు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయని దీనికి జయ ఏకాదశి అనే పేరు పెట్టారు. ఇంద్రుడు రాక్షసుల మీద ఈ తిథి నాడు యుద్ధానికి వెళ్లడం వల్ల ఆయన విజయం సాధించాడని, భృగు మహర్షి తన తపస్సులో విజయం సాధించి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడని, అగస్త్యుడు మూడు గుక్కల్లో సముద్రాన్ని తాగి వేసినదీ ఈ తిథినాడేనని చెబుతారు. అయితే ఈ ఏకాదశినాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మా రాధనతో మన లక్ష్యమైన ఉత్తమ లోక ప్రాప్తి సాధించడంలో విజయుల వుతారని అంటారు. ఇక్కడ భీష్ముని గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భీష్ముడు అష్ట వసువులలో ఒకడనే విషయం తెలిసిందే. శాపవశాన గంగా దేవి కుమా రునిగా భూమిపై అవతరించాడు. ఆయన మహా వీరుడు. విష్ణువు అవతారమైన పరశురాముడే యుద్ధంలో ఆయనను ఓడించలేకపోయాడు. ఇక ఆయన పట్టుదలకు మారు పేరు. ప్రతిజ్ఞ చేశాడంటే ఇక వెనక్కు తగ్గేది లేదు. అందుకే తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆయన తాను పరమాత్మగా భావించే కృష్ణుని మాదిరి ధర్మ పక్షపాతి. ఇక ఆయన నోటి నుంచే ఈనాడు ఎక్కువ మందికి సుపరిచితమైన అమోఘమైన విష్ణు సహస్రనామం వచ్చింది. అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ఇది ఒక భాగమని విజ్ఞులు చెబుతారు. కృష్ణుని నవ్వు రాజిల్లెడి మోము చూస్తూ దైవ కృపతో ఆయన ఈ సహస్రనామాలు చెప్పాడని అంటారు. భీష్ముడు మనకు ఎన్నో విషయాలు చెప్పారు. ధర్మంగా ఉండాలని, ఆడిన మాట తప్పకూడదని. శంతనునికి పిండాలు సమర్పించేసందర్భంలో ఆయన శాస్త్ర వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శంతనుని చేతిలో పిండం పెట్టక పోవడం ఆయన ధర్మనిరతికి సంకేతం. అంతేకాక తన ప్రతిజ్ఞతో, మానవుడై నవాడు ప్రతిజ్ఞ చేస్తే ఎలా దానిని నిలబెట్టుకోవాలో తన జీవితంతో చేసి చూపారు. అయితే తప్పుడు ప్రతిజ్ఞలు చేసి వాటిని నిలబెట్టుకోవడం కాదు. ఆ ప్రతిజ్ఞ కూడా ఒక ధర్మం కోసం చేశాడు. తన తండ్రి సుఖం కోసం ఆయన ఆ ప్రతిజ్ఞ చేశాడు. ఇవి కాక ఆయన చేసి చూపిన మరో బోధ ఎట్టి పరిస్థితిలోనూ బేలతనం పనికి రాదని, యుద్ధంలో ధర్మం పాండవుల పక్షాన ఉన్నాడని ఆయనకు తెలుసు. విష్ణు స్వరూపుడైన కృష్ణుడు అటు వైపున్నాడని తెలుసు. తాము ఓటమి పాలవుతామని తెలుసు. (ఈ విషయం చాలా మార్లు దుర్యోధనునికి తెలిపాడు) అయినా భీరువులా చేతులు ముడుచుకు కూర్చోలేదు. తన వంతు కృషిగా యుద్ధం చేశాడు. ఇది కూడా కృష్ణుడు గీతలో చెప్పిందే. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అనే నీతి దీనిలో మనకు కనిపిస్తుంటుంది. భీష్మస్తుతిలో కూడా ఆయన మనకు ఒక సందేశం చెప్పారు. కాలం ఎంత బలీయమైనదో వివరించారు. ఎంతటి వారికైనా కష్టాలు తప్పక పోవచ్చనే విషయం ఆయన ఆ సందర్భంగా చెప్పారు. భీష్మ స్తుతిలోని ఈ పద్యం ఆ విషయం చెబుతుంది. అది 'రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమై గాండీవము విల్లుట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో ఉప పాండవులను అశ్వత్థామ చంపి వేసిన విషయానికి సంబంధించినదీ శ్లోకం. దీని అర్థం ప్రస్తుతం రాజు ధర్మరాజు, సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుని కుమారుడు (అర్జునుడు) ధర్మజునికి తమ్ముడు. అతని చేతిలో ఉన్నది చూచినంతనే శత్రువులు భయకంపితమయ్యే గాండీవం. ఇకసారధి అంటారా అన్నిటినీ నడిపే సమర్థుడైన చక్రి, ఉగ్ర గదాధరుడైన భీముడు (ఏనుగులను తొండం పట్టి ఆకాశ వీధిలోకి ఎగరేసే వాడంటారు మరో చోట) అతనికి తోడుగా ఉంటాడట. ఇటువంటి బలవంతుల మధ్య ఉన్న ఉప పాండవులు చనిపోయారే కాలం ఎంత బలవత్తరమైనదో కదా అని ఆ విషయాన్ని ఆయన వివరించాడు. అంటే కాలం ఎవరికీ బంధువు కాదు. దానికి స్వపర భేదా లుండవు అనేది ఆయన మనకు బోధించాడు. ఇక కృష్ణునిపై ఆయనకున్న భక్తి అసమానం. చక్రం పట్టిస్తానన్న తన శపథం నెరవేర్చేందుకు ఆయన చక్రం పట్టాడని ఆయనకు తెలుసు. అయితే చక్రం పట్టడం కూడా ఆయన మరో భక్తునికి ఆపద తప్పించడానికనే విషయం గ్రహించారు. ఒక భక్తుని శపథం నెరవేర్చేందుకు చక్రం పట్టాడు. మరొక భక్తుణ్ని భీష్ముడి వాడి బాణాల నుంచి కాపాడేందుకు చక్రం పట్టాడు. పర మాత్మకు భక్తుల పట్ల ఉన్న ప్రేమను ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఎన్నో విధాలుగా భీష్ముడు మనకు ఆదర్శప్రాయుడు. ఈ భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటుంటారు. భీమ అనేది గట్టితనం అనే అర్థాన్ని సూచిస్తుందని, ఈ ఏకాదశిని అంత గట్టిగా ఆచరిం చాలన్నదే దాని ఉద్దేశమని కొందరి అభిప్రాయం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
440 views
2 months ago
#భీష్మ ఏకాదశి అంటే ఏమిటీ? విశిష్టత? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #భీష్మ ఏకాదశి రోజున ఇలా తర్పణం *భీష్మ ఏకాదశి* *జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా...* 🌹🌺 *భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు?* 🌺🌹 మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు. సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు. కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వస ారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
2.5K views
2 months ago
#భీష్మ ఏకాదశి #విష్ణు సహస్రనామ జయంతి. #🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 ----------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ ------------------------------------ గురువారం,జనవరి29, 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం-శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి: ఏకాదశి:మ12.10వరకు వారం: గురువారం (బృహస్పతివాసరే) నక్షత్రం:మృగశిరతె4.32వరకు యోగం:ఐంద్రం:రా7.43వరకు కరణం: భద్ర:మ12.10వరకు తదుపరి:బవ:రా11.01వరకు వర్జ్యం: ఉ11.22 - 12.52 దుర్ముహూర్తము: ఉ10.21-11.06 మరల: మ2.50 - 3.34 అమృతకాలం: రా8.19-9.49 రాహుకాలంమ12.00 - 1.30 యమగండ/కేతుకాలం : *మ7.30 - 9.00* సూర్యరాశి: మకరం చంద్రరాశి: వృషభం సూర్యోదయం : 6.38 సూర్యాస్తమయం: 5.49 ------------------------------------- 👉 *భీష్మ ఏకాదశి* ------------------------------------- సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు --------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి* ---------------------------------------
Mohan
3K views
2 months ago
#భీష్మ ఏకాదశి #🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు #📙ఆధ్యాత్మిక మాటలు #🌷గురువారం స్పెషల్ విషెస్ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 🎪🕉️🚩శ్రీ విష్ణు సహస్రనామ ఆవిర్భావ దినం మరియు భీష్మ పితామహులు మోక్షం పొందిన పవిత్రమైన భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు!!💐🙏💐 "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం జనియించిన ఈ పవిత్ర రోజున.. ఆ మహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ.. పితామహ భీష్ముడు విష్ణు సాయుజ్యాన్ని పొందిన పుణ్య ఘడియలను స్మరిస్తూ...ధర్మ స్థాపన కోసం నిలబడిన భీష్ముని స్ఫూర్తితో.. మీ జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆశిస్తూ.. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు💐🙏💐
PSV APPARAO
747 views
2 months ago
#భీష్మ ఏకాదశి రోజున ఇలా తర్పణం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #నేడు భీష్మాష్టమి🙏🙏🙏🙏🙏🙏 #భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? భీష్మతర్పణ విధి - భీష్మాష్టమి: భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ ! సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!" తర్పణము 1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః! ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను) 2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ! అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను) 3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను) పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !! (తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి) 1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) 2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) 3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను) 4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను) అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!" వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ ! గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే! అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే! అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! #namashivaya777 https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
PSV APPARAO
820 views
2 months ago
#నేడు భీష్మాష్టమి🙏🙏🙏🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 🔔 *విశేషం* 🔔 🌼 ఈ రోజు భీష్మాష్టమి – ధర్మం, త్యాగం, భక్తికి మహాపర్వం 🌼 🕉️ భీష్మ పితామహుని స్మరణతో జీవితం పవిత్రమయ్యే శుభతిథి 🕉️ ━━━━━━━━━━━━━━ 🔱 భీష్మాష్టమి ప్రాముఖ్యత ━━━━━━━━━━━━━━ రథసప్తమి తరువాత వచ్చే అష్టమి తిథియే భీష్మాష్టమి. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తూ, శ్రీకృష్ణుని ధ్యానంతో పరమపదం చేరిన మహాత్ముడు భీష్ముడు ఈ రోజునే దేహత్యాగం చేశాడు. అందుకే ఈ తిథి ధర్మశాస్త్రాలలో అత్యంత విశేషంగా పేర్కొనబడింది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా, సత్యం–త్యాగం–నిష్ఠలకు ప్రతిరూపంగా జీవించాడు. భగవాన్ శ్రీహరిని కన్నులారా దర్శిస్తూ ముక్తి పొందిన అపూర్వ మహానుభావుడు. ━━━━━━━━━━━━━━ 💧 భీష్మ తర్పణం – ఎవరు చేయాలి? ━━━━━━━━━━━━━━ సాధారణంగా పితృతర్పణం తండ్రి లేనివారే చేస్తారు అనే భావన ఉన్నా, భీష్మ తర్పణం మాత్రం తండ్రి జీవించి ఉన్నవారు కూడా తప్పక చేయాలి అని ధర్మశాస్త్ర ఆజ్ఞ. స్త్రీలు తప్ప మిగతా అందరూ ఈ రోజున భీష్మునికి తిల–జల అర్ఘ్యప్రదానం చేయడం కర్తవ్యంగా చెప్పబడింది. ఇది పెద్ద కర్మకాండ కాదు. నిత్యకర్మలు పూర్తిచేసుకుని, శుద్ధమనస్సుతో 10 నిమిషాల్లో చేయగల సులభమైన ధర్మాచరణ. ━━━━━━━━━━━━━━ 📿 సారాంశ విధి (సంక్షిప్తంగా) ━━━━━━━━━━━━━━ • నిత్యకర్మలు, ఆచమనం, ప్రాణాయామం తరువాత సంకల్పం • యజ్ఞోపవీతం అపసవ్యం చేసి దక్షిణ దిక్కుకు తిరిగి తిల–జల తర్పణం • భీష్ముని స్మరిస్తూ శ్లోకాలతో తర్పణం • తరువాత ఉపవీతం సవ్యంగా చేసి తూర్పు దిక్కున అర్ఘ్యప్రదానం ⚠️ పూర్తిగా చేయలేని వారు కనీసం మూడు సార్లు దోసిలితో నీటిని విడుస్తూ భీష్మ శ్లోకాలను చదివినా ఫలితం కలుగుతుంది. ━━━━━━━━━━━━━━ 📜 భీష్మునికి అర్ఘ్య శ్లోకం ━━━━━━━━━━━━━━ భీష్మః శాన్తనవో వీరః సత్యవాది జితేంద్రియః । ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ ॥ ━━━━━━━━━━━━━━ 🌿 భీష్ముడి విశిష్టత ━━━━━━━━━━━━━━ భగవాన్ శ్రీకృష్ణుడు నిత్యం స్మరించిన మహాభక్తుడు భీష్ముడు. “నేను స్మరిస్తున్నది నా భక్తుడు భీష్ముడు” అని కృష్ణుడు స్వయంగా అన్న మహానుభావుడు. త్యాగంలో, ధర్మంలో, భక్తిలో భీష్మునికి సాటి భీష్ముడే. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించినవాడు, విష్ణుసహస్రనామాన్ని లోకానికి అందించిన జ్ఞానసాగరం. ━━━━━━━━━━━━━━ 🌸 భీష్మ పంచకం ━━━━━━━━━━━━━━ భీష్మాష్టమి నుండి భీష్మద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. ఈ ఐదు రోజులు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు కేటాయించబడ్డాయి. ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి (జయ ఏకాదశి) నాడు • ఉపవాసం • విష్ణు సహస్రనామ జపం • భగవద్గీత పఠనం చేస్తే వ్యక్తిత్వం సాత్వికంగా మారుతుందని శాస్త్రవచనం. ━━━━━━━━━━━━━━ ✨ ఈ రోజు సందేశం ━━━━━━━━━━━━━━ భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యుడు, ధర్మజ్ఞుడు, మహాభక్తుడు. ఈ రోజు ఆయనను స్మరించి తర్పణం ఇచ్చినవారి పాపాలు దహించిపోతాయని పెద్దల విశ్వాసం. 🌼 భీష్మాష్టమి – మనలోని ధర్మాన్ని మేల్కొలిపే మహాపర్వం 🌼 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
PSV APPARAO
785 views
2 months ago
#భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? సంతానం తప్పక కలుగుతుందా? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు *భీష్మాష్టమి* మాఘ శుక్ల అష్టమిని భీష్మాష్టమని పద్మ పురాణంలో వివరంగా చెప్పబడివున్నది. *'మాఘే మాసి సితాష్ట్యమాం సతిలం భీష్మతర్పణం* *శ్రాద్ధంచ యే నరాఃకుర్యుఃతేస్యుః సంతతి భాగినః* మాఘ శుద్ధ అష్టమినాడు నువ్వులతో భీష్మునికి తర్పణం వదిలి శ్రాద్ధము చేసిన వారికి సంతానము కలుగును. అదేవిధంగా వారికి ఆ సంవత్సరం చేసిన పాపం నశించును. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మునకు తిల తర్పణం చేసి, అన్నదానం చేయవలెను. *వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ* *అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే* *వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ* *అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే* ఈ అర్ఘ్య తర్పణ మంత్రములతో శ్రాద్ధం చేసి అన్నదానం చేసినచో ఈప్సితార్థ(కోరుకున్నది) సిద్ది కలుగును. అనగా కోరుకున్నది సిద్ధించును. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
966 views
2 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏భీష్మాష్టమి శుభాకాంక్షలు #భీష్మాష్టమి శుభాకాంక్షలు *మానవాళికి మార్గదర్శి* *జనవరి 26 సోమవారం భీష్మాష్టమి సందర్భంగా* ... మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకా లుగా భావిస్తారు. భారత యుద్ధం సమ యంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్త రాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనా డారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మ సింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్దాష్టమిని భీష్మ నిర్యాణ దీనంగా చెపుతున్నాయి. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ద ప్రారంభదినంగా భావించ బడుతుంది. కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై నట్లు భారతంలో ఉంది. "కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవు తుంది. కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయ బారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లా డాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపు తాడు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది. భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు. భారత యుద్ధ ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘ శుద్దాష్టమి. అదీగాక భారతయుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధు వధకు శంకిస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవ ద్గీత. ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభదినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి (భగవ ద్గీత పుట్టినదినం)గా జరపడం కొన్ని చోట్ల ఉంది. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. పద్మ పురాణంలో, హేమాద్రి వ్రత ఖండంలో భీష్మా ష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుందని విశ్వాసం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తా రని నిర్ణయసింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవా ల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తు న్నది. కొందరు పంచాంగకర్తలు ఈనాటి వివర ణలో నందినీ పూజ, భీష్మాష్టమిగా పేర్కొం టారు. "వైయాఘ్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ, అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే, వసూ రామవతారాయ శంతనోరాత్మజాయచ, అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచా రిణే". అంటూ ఈదినం నాడు భీష్ములకు తర్పణం విడవాలని అమాదేర్ జ్యోతిషి పేర్కొంటున్నది. ఈనాడు తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని పురాణోక్తి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*