హిందూ దేవుళ్ళు * దేవాలయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
824 views
24 days ago
నాగనాథస్వామి ఆలయం, తిరునగేశ్వరం......!! రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది. ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦. మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచినది ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు. ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట. ఆలయానికి ఎలా వెళ్లంటే? మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16 గంటల పడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజు పడుతుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
559 views
29 days ago
శని దోషాలను హరించే తిరునల్లారులో... దాగివున్న మహా నిధి "మరకత లింగం" ​హృదయంలో ఈశ్వరుడి ధ్యానంతో... ​పుదుచ్చేరి, కారైకాల్ సమీపంలో ఉన్న తిరునల్లారు దర్భారణ్యేశ్వర స్వామి దేవాలయం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శనీశ్వర భగవానుడే. కానీ, ఈ ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ అయిన దర్భారణ్యేశ్వరుని సన్నిధికి సమీపంలో, ముచుకుంద చక్రవర్తిచే ప్రతిష్ఠించబడిన ఒక అరుదైన "మరకత లింగం" (త్యాగరాజ సన్నిధి) ఉందనే విషయం చాలామందికి తెలియదు. ​ఈ లింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలు ఇవిగో. ​ఇంద్రుడు ఇచ్చిన కానుక: దేవేంద్రునిచే పూజించబడి, ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తికి బహుకరించబడిన అత్యంత పవిత్రమైన విడంగ లింగాలలో (స్వయంభూ లింగాలు) ఇది ఒకటి. ​అభిషేక అద్భుతం: ఈ మరకత లింగానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా, ఈ లింగానికి చేసే 'పన్నీటి అభిషేకం' ఎంతో ప్రసిద్ధి చెందింది. మరకత శిలపై పన్నీరు జారి పడేటప్పుడు కలిగే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ (కంపనాలు) మానసిక ఒత్తిడిని, ఆందోళనలను దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ​ప్రదోష పూజ మహిమ: ప్రదోష రోజుల్లో ఈ మరకత లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని చెబుతారు. ఏల్నాటి శని, అష్టమ శని వంటి శని దోషాల తీవ్రతను తగ్గించి, శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించే శక్తి ఈ పూజకు ఉంది. ​బుధ-శని కలయిక ఫలితం: తిరునల్లారు ప్రధానంగా శని క్షేత్రం అయినప్పటికీ, బుధునికి సంబంధించిన రత్నమైన మరకత (పచ్చ) లింగం ఇక్కడ కొలువై ఉండటం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక. ఈ లింగాన్ని పూజించడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి, భారీ లాభాలు చేకూరుతాయని, అలాగే బుద్ధి కుశలత (తెలివితేటలు) పెరుగుతాయని నమ్మకం. ​తిరునల్లారు వెళ్లే భక్తులు కేవలం శని భగవానుడిని మాత్రమే దర్శించుకుని తిరిగి రాకుండా, గర్భగుడిలో కొలువై ఉన్న ఈ దివ్యమైన మరకత లింగాన్ని కూడా దర్శించుకుని, స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి! #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.4K views
1 months ago
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది? శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది. కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
708 views
1 months ago
తెనాలి "దొంగ" రాముని గుడి, తెనాలి !!! కాటన్ దొర పుణ్యమా అని 1848లో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించగా, కెప్టెన్ అలెగ్జాండర్ ఆర్ 1880 దశకంలో తెనాలి తాలూకాలో కాలువలు త్రవ్వి క్రమబద్ధంగా నీటి వసతి కల్పించారు. తెనాలి పట్టణం మధ్యగా మూడు కాలువలు అనగా పంటకాలువ, పడవల కాలువ, పడమర కాలువలు వరుసగా ప్రవహించడం ఒక పెద్ద వింత..!!ఇలాంటి సౌభాగ్యం భారతదేశంలో మరే పట్టణానికి లభించలేదు. విచిత్రం ఏంటంటే, విజయవాడ నుండి నిజాంపట్నం వరకు నిరంతరాయంగా పడవలు తిరుగుతూండేవి. మనుషుల ప్రయాణం, సరకుల రవాణా పడవల పైనే సాగేది. పడవ నడిపేవారు, యాత్రికులు రాత్రిపూట విశ్రాంతి తీసుకోడానికి మతుకుమల్లి రఘోత్తమరాయుడు అనే పుణ్యాత్ముడు 1899లో కాలువ పడమర ఒడ్డున ఒక సత్రాన్ని నడిపేవారట. అప్పట్లో అది ఒక వింత అట!!!అయితే, కాలువ తూర్పు వైపున కూడా ఒక వింత జరిగింది. దాని గురించి ఇప్పటికీ కధలు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అదే తెనాలి నడిబొడ్డున గల రామాలయం. తెలుగువారి ఆరాధ్యదైవం శ్రీరాముడు. అప్పటి వరకు తెనాలిలో రామాలయం లేదు. స్థలం అడిగితే, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరోజున, కొందరు యువకులు పూనుకుని రాత్రికి రాత్రే సీతారాముల విగ్రహాలను నేడు గుడి ఉన్న స్థలంలో ప్రతిష్టించారు. తదుపరి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఎవరి అనుమతి లేకుండా, దొంగతనంగా నిర్మించినందున దొంగరాముడి గుడి అనే పేరు వచ్చింది. ఆ ఆలయానికి దక్షిణ భాగంలో పట్టణవాసుల ఉపయోగార్థం బావిని త్రవ్వారు. ఈ బావి వర్తులాకారంగా గుడి ముందే ఉండేది. ఎత్తైన గిలకలు, గుండ్రని చష్టాతో కనువిందుగా, నిత్యం కోలాహలంగా ఉండేది. ఈ బావిని గాడి బావి అనేవారు. 1950 దశకంలో ఈ బావిలో దూకి ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నందున బావిని శాశ్వతంగా మూసి వేశారు. ఈ బావి గల ప్రాంతం గాడి బావి సెంటర్ గా ప్రసిద్ధి చెందింది.దొంగ రాముని గుడిగా పేరొందిన ఈ రామాలయం నేటికీ నిత్య ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉంది. కథనానికి ఆధారం: తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలు ప్రత్యేక సంచిక #తెలుసుకుందాం #గుళ్ళు #hindu temples #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.5K views
3 months ago
హిందూ దేవుళ్ళు నల్లరాయితో ఎందుకు..? --------------------------------- 🌹 హిందూ రిలీజియన్లో దేవుళ్ళను నల్లరాయితోనే చేస్తారు. ఎందుకంటే... హిందువులు నల్లరాయిని అతి పవిత్రమైన దానిగా భావిస్తారు. అది నిజం కూడా…. ఎందుకంటే మార్బల్ రాయి కానీ తెల్ల రాయి కానీ ఏ రాయి అయిన కొన్ని సంవత్సరాలు గడుస్తుంటే అవి సైజు తగ్గుతూ కరిగిపోతూ ఉంటై. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు తెలుసు కున్నారు .అందుకే వారు నల్ల రాయిని ఎంచుకున్నారు. ఈ రాయి అయితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయిన చెక్కు చెదర కుండా ఉంటుంది. మళ్ళీ ఈ నల్ల రాయిని కూడా వాళ్ళు 3 రకాలుగా విభజించారు. 1. మొగ రాయి 2. ఆడ రాయి 3. నపుంసక రాయి అవును…. రాళ్ళూ అన్ని ఒక్కటి కాదు అందులో కూడా ఆడ, మగ ఉంటాయి. మొగరాయిలో కేవలం మొగ దేవుళ్ళ విగ్రహాలు మాత్రమే చేస్తారు. ఈ రాయి కొంచెం కఠినంగా రఫ్ గా ఉంటుంది. ఈ రాయితో కళాకారుడు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆడరాయిలో కేవలం ఆడ దేవతల విగ్రహాలు మాత్రమే చేస్తారు. ఈ రాయి కూడా కఠినంగానే ఉంటుంది. కానీ మొగ రాయి అంత కాదు. కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది. నపుంసక రాయిలో కేవలం గుడికి కావాల్సిన గోడలు స్తంభాలు అవసరం ఉన్న స్టాండ్ లు మాత్రమే చేస్తారు. 10,000 వేల సంవత్సరాలు పైన చరిత్ర ఉన్న మతంలో ఈ మాత్రం ఆర్కిటెచర్ ఉంటుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
639 views
3 months ago
*"గర్భగుడిలో నిశ్శబ్దం ఎందుకు ఉంటుంది? దేవుడు వినడానికి కాదు… మనసు వినిపించడానికి!”* 💅💅💅💅💅💅💅💅💅 మీరు ఎప్పుడైనా గమనించారా... గుడి బయట ఎంత రద్దీగా, శబ్దంగా ఉన్నా గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఆటోమేటిక్‌గా మనం మౌనంగా మారిపోతాం. ఎవరూ “శ్… నిశ్శబ్దం” అని చెప్పకపోయినా మన గొంతు తక్కువవుతుంది... మాటలు ఆగిపోతాయి… మనసు నెమ్మదిస్తుంది. అది కేవలం భక్తి వల్ల కాదు. దాని వెనుక గొప్ప మానసిక శాస్త్రం ఉంది. గర్భగుడి అంటే “గర్భం” — womb. తల్లి గర్భంలో శిశువు ఎలా పెరుగుతాడు? శబ్దం లేకుండా… చీకటిలో… ప్రశాంతంగా. మన పూర్వీకులు అదే భావనతో ఆలయ గర్భగుడిని నిర్మించారు. మనిషి బయట ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి తనలోకి వెళ్లేందుకు. మన మెదడు రోజంతా ఏం చేస్తుందంటే — ఫోన్ నోటిఫికేషన్స్, పనులు, డబ్బు, టెన్షన్, సమస్యలు… ఎప్పుడూ ఆలోచనలతో పరుగెడుతూనే ఉంటుంది. మెదడు ఎప్పుడూ శబ్దం వింటే అది alert mode లో ఉంటుంది. దీనిని science లో “fight or flight state” అంటారు. కానీ నిశ్శబ్దంలోకి వెళ్తే మెదడు “relax mode” లోకి మారుతుంది. దీనిని alpha state అంటారు. *ఈ స్థితిలో:* *• హృదయ స్పందన తగ్గుతుంది* *• రక్తపోటు తగ్గుతుంది* *• ఆందోళన తగ్గుతుంది* *• మనసు ప్రశాంతంగా మారుతుంది* అందుకే గర్భగుడిలో పెద్దగా మాట్లాడొద్దని చెబుతారు. దేవుడు కోపపడతాడని కాదు… మన మనసు ప్రశాంతంగా మారేందుకు. *ఇంకా ఒక కారణం ఉంది 👇* గర్భగుడి నిర్మాణం చాలా చిన్నగా, మూసివేసినట్టు ఉంటుంది. శబ్దం చేస్తే అది ప్రతిధ్వనిగా తిరిగి మన చెవుల్లో పడుతుంది. దీంతో మెదడు అసహనంగా మారుతుంది. కాబట్టి మౌనం పాటిస్తే మంత్రోచ్ఛారణ, గంట శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అవి మన శ్వాసను, హృదయాన్ని ఒకే రిథమ్‌లోకి తీసుకువస్తాయి . అందుకే దేవాలయంలో కొన్ని క్షణాలు నిలబడితే బయటకు వచ్చినప్పుడు మనకు ఒక తేలికగా అనిపిస్తుంది. మన సమస్యలు తగ్గకపోయినా… మన ఆలోచనలు తగ్గుతాయి. గర్భగుడి నిశ్శబ్దం దేవుడి కోసం కాదు. మనలోని శబ్దాన్ని ఆపి మనలోని దేవుడిని వినిపించడానికి. కాబట్టి తర్వాతసారి గర్భగుడిలోకి వెళ్లినప్పుడు కోరికలు అడగకముందు… ఒక్క 30 సెకన్లు మౌనంగా నిలబడండి. మీకు సమాధానం మాటల్లో కాదు... మనసులో వినిపిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.5K views
3 months ago
నవ గ్రహ దేవాలయాలు...........!! నవగ్రహములు తొమ్మిది. ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. కుంభ‌కోణం... తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహపీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు. 1.సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి.. తమిళనాడు రాష్ట్రములోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ అని పిలువబడే సూర్యదేవాలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు . ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు. ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము. ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. 2. చంద్రగ్రహ దేవాలయము - తిరువైయార్.. తిరువైయారుకు 5 k.m దూరములో చంద్రగ్రహ దేవాలయము వుంది. తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయములోని చంద్రభగవానుని దర్శనము సుఖాన్ని,దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్.. అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది. 3. అంగారక (కుజ) గ్రహ దేవాలయము - వైథీశ్వరన్ కోవిల్.. తిరువైయార్‌కు ఆరు (6 km ) కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. అనేక వ్యాధులను అంగారకుడు పోగొడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము. వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు . 4.బుధగ్రహ దేవాలయము - తిరువెన్నాడు.. అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది. ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి. వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది . ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము. 5.బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము ఆలంగుడి.. కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడిలో గురు గ్రహ దేవాలయము వున్నది. ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము. దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు. శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు. భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు. గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుకబడినవారు చదువులో మరియు ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము. గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము. 6.శుక్ర గ్రహ దేవాలయము - కామ్చనూరు. కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది . దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు. 7.శని గ్రహ దేవాలయము - తిరునల్లార్.. ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది . ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు. ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము . ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే. శనీశ్వరునితో పాటు నలదమయంతులకు పూజ చేస్తే శని ప్రభావము ఉండదు . ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది. 8.రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము. కుంభకోణానికి 5 k.m దూరములో వుంది. రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే. ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంఠభాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్ని నీలము రంగులోకి మారతాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు. ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కారకోటుడు రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు. ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి. 9.కేతు గ్రహ దేవాలయము - కిల్ పేరుంపళ్లమ్. తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది. ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు. ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది. అదిత్యాయచ సోమాయ మంగళాయ బుదాయచ.. గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!! #తెలుసుకుందాం #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
763 views
3 months ago
మృత్తికా ప్రసాదం...........!! కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం..! మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు . దీన్ని చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు. ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి.. ఆ ప్రసాదాలను ఎం చేయాలి.. ఇక్కడ చూద్దాం.. మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు. మృత్తికా ప్రసాదం వివరాలు.... 1. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది. 2. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. 3. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్థానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్థానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన చేస్తే వివాహం త్వరగా అవుతుంది. 4. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు. 5. ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు. 6.ఏ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో . అటువంటి పిల్లలకు స్థానం చేయిoచే సమయంలో వేడి నీటితో స్థానం చేయిoచిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్దించి ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది. 7. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు. 8. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంతా నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు. 9. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రార్ధన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది. 10. ఎవరింట్లో అయితే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వడలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి. 11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్థానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు. #తెలుసుకుందాం #🙏🦚MURUGA🦚🙏 #సుబ్రహ్మణ్య స్వామి💐 #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
865 views
3 months ago
మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం.........!! 1.మూలవిరాట్..! భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి. 2. ప్రదక్షిణ..! మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. 3. ఆభరణాలతో దర్శనం..! ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని. 4. కొబ్బరి కాయ..! ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం. 5. మంత్రాలు..! ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరుస్తాయి. 6. గర్భగుడి..!! గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు. 7. అభిషేకం..! విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం. 8. హారతి..! పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు. 9. తీర్థం..! ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. 10. మడి..! తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి.!! #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂