🎤పాలిటిక్స్

DUDEKULA DASTAGIRI
612 views
2 days ago
#మండల_పార్టీ_అధ్యక్షునికి_పుట్టినరోజు_శుభాకాంక్షలు_తెలిపిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మార్తాల సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు. అనంతరం మండల మరియు పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
581 views
2 days ago
#కరాటే_ఛాంపియన్స్_చిన్నారులను_అభినందించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ నెల ఆగస్టు 1,2 వ తేదీన విజయవాడ మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన 23వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్–2026లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గౌ " ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి గిద్దలూరు పేరు ప్రతిష్టలను నిలబెట్టిన క్రీడాకారులు యువతకు ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి గిద్దలూరు నియోజకవర్గానికి,జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే గా ఎల్లప్పుడూ తమ వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. విజేతలకు , జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు కరాటే శిక్షకులకు , సిబ్బంది ని క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కరాటే శిక్షకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మరియు అభిమానులు పాల్గొన్నారు. #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
631 views
2 days ago
*ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం.. ముఖ్యమంత్రి సహాయనిధి..* *గిద్దలూరు నియోజకవర్గంలోని 85 మందికి రూ. 55,15,730 - 00 లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల* *గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 85 మందికీ 21 వ విడతగా మంజూరు అయిన, రూ 55,15,730 - 00 లు (అక్షరాల యాభై ఐదు లక్షల పదహైదు వేల ఏడువందల ముప్పై రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి , చెక్కులను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చునన్నారు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1160 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 10,79,34,309-00 లు (అక్షరాల పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు..* *ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లు, ZPTC లు , మండల పార్టీ అధ్యక్షులు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.* #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
596 views
2 days ago
#పరామర్శతో_మనోధైర్యం_నింపిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా :#గిద్దలూరు మండలం #సంజీరావుపేట పంచాయతీ #అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీ గంగారపు రమణారెడ్డి గారు అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని మునుపటిలా ఆరోగ్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం అయిన బిల్లుల ఆధారంగా ప్రభుత్వం దృష్టికి తీసుకేలి ముఖ్యమంత్రి సహాయ నీది (#Cmrf )ద్వారా 1,15,942 : 00 రూపాయల చెక్కు ను అందించారు. అనంతరం గ్రామంలో ప్రజలను ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని ఆప్యాయంగా పలకరించినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , ZPTC బుడతా మధు సుధన్ , మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి , క్లస్టర్ ఇంచార్జీ రామక్రిష్ణ , నంది శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, గోపాల కృష్ణ, కిరణ్, గోడి ఓబుల్ రెడ్డి, గుర్రం దానియేలు, గ్రామస్తులు తదితరులు పాల్గొని పరామర్శించారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
710 views
3 days ago
ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావు గారిని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్ గారు. #ChagantiKoteswaraRao #NaraLokesh #AndhraPradesh #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
1.1K views
3 days ago
*"మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పూసలపాడు పంచాయతీ ఒందుంట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన 346 పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఘనంగా నిర్వహించడం జరిగింది.* *ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు పాల్గొని రైతు లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను మరింత పటిష్ఠంగా పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.ప్రభుత్వ రాజముద్రతో అందజేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు తమ భూమిపై పూర్తి హక్కుకు అధికారిక గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రైతులు , ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని నేడు కూటమి ప్రభుత్వం లో ఆ యాక్ట్ రద్దు చేసి అత్యంత పారదర్శికంతో అన్ని రక్షణ ప్రమాణాలతో రాజ ముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు* *ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు