*"భోగాపురం ప్రారంభోత్సవానికి భారీ జనసమీకరణే లక్ష్యం.. భీమిలిలో మంత్రులు, ఎమ్మెల్యేల సమీక్ష"*
*విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కార్యాలయంలో, ఆగస్టు1వ తేదీన అనగా రేపు జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు విచ్చేస్తున్న సందర్భంగా జన సమీకరణ, కార్యకర్తల తరలింపు, రవాణా మరియు ఇతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.*
*ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, పొంగూరు నారాయణ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్యేలు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, శ్రీ పులివర్తి నాని గారు, గిద్దలూరు నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టడం, కార్యకర్తలకు అవసరమైన రవాణా సౌకర్యాలు, సభా ప్రాంగణ ఏర్పాట్లు, సమన్వయ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి సంబంధిత బాధ్యులకు తగిన సూచనలు చేశారు.*
#✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్