*ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*
*గిద్దలూరు పట్టణంలోని 16 వ వార్డు కొండపేట గ్రామంలో " ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు " కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు నిర్వహించారు.*
*ఈ సందర్భంగా వార్డు నాయకులు , ప్రజలు ఎమ్మెల్యే గారికి సాగర స్వాగతం పలికారు వార్డు లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవల గురించి వివరించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.*
*ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పారదర్శక పాలనతో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పట్టణం , గ్రామాల పురోగతి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు. అనంతరం వార్డు నాయకులు, మహిళలు ప్రజలు గౌ " ఎమ్మెల్యే గారిని శాలువ, పూలమలతో ఘనంగా సన్మానించారు*
*ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.*
#🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు